Minister Bhupathi Raju: రేపు విశాఖ స్టీల్ ప్లాంట్‌ సందర్శనకు కేంద్ర మంత్రులు..

  • కేంద్ర ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాక తొలి సందర్శన
  • కేంద్రమంత్రి కుమారస్వామితో కలిసి వెళ్లనున్న మంత్రి భూపతిరాజు
  • కార్మిక సోదర సలహాలు తీసుకునేందుకు పర్యటన
Bhupathi Raju Srinivasa Var

Bhupathi Raju Srinivasa Var

విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాక తొలి సందర్శనకు వెళ్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. రేపు తొలి సారి ప్లాంట్ సందర్శన కోసం కేంద్రమంత్రి కుమారస్వామితో కలిసి వెళ్తున్నట్లు చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం.. కార్మిక సోదర సలహాలు తీసుకునేందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ప్రధాని సంకల్పం, నిర్మలా సీతారామన్, కుమార స్వామి, చంద్రబాబుల ఉక్కు పట్టుదలతో సాధ్యం అయిందన్నారు. విశాఖ పరిరక్షణ తమ బాధ్యతని.. ప్లాంట్ పూర్తి ఉత్పత్తి సామర్థ్యం దిశగా ప్రయత్నం చేయడం కేంద్రం లక్ష్యమన్నారు. సమిష్టిగా పని చేసి లాభాల్లోకి తీసుకు వెళ్ళే బాధ్యత అందరిపై ఉందన్నారు. స్టీల్ ఉత్పత్తి ఏ దేశానికైనా అత్యంత అవసరమని తెలిపారు. 2030 నాటికి దేశంలో 300ల మిలియన్ టన్నుల ఉత్పత్తికి పెంచాలని ప్రధాని ఆలోచించినట్లు వెల్లడించారు.

READ MORE: AP High Court: వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా..

స్టీల్ ప్లాంట్ కార్మికుల వేతన బకాయిలు చెల్లించేందుకు ఆలోచన చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. “కార్మికుల ప్రయోజనాల కోసం పని చేస్తున్నాం. ఎటువంటి అపోహలకు పోవద్దు. ప్యాకేజీ కావాలని డిమాండ్ చేసిన వాళ్ళు.. ఇపుడు మరోలా వాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ పై జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు. వైజాగ్ స్టీల్ కు 35 వేల కోట్ల బకాయిలు ఉన్న విషయం వాస్తవం.” అని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వ్యాఖ్యానించారు.

READ MORE: Ananya Panday: హీరోని వదిలేసి అతనితో హీరోయిన్ డేటింగ్?