NTV Telugu Site icon

Rajnath Singh: కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌

Rajnath Singh

Rajnath Singh

Rajnath Singh: భక్తి టీవీ, ఎన్టీవీల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. హైదరాబాద్‌ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవ వేడుకకు చేరుకున్నారు. కార్తిక సోమవారం శుభవేళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Koti Deepothsavam Ad

ముందుగా బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన ప్రత్యేక వాహనంలో కోటి దీపోత్సవం ప్రాంగణానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేరుకున్నారు. రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు కిషన్‌ రెడ్డి కోటి దీపోత్సవానికి  హాజరయ్యారు. వారికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. రాజ్‌నాథ్ సింగ్ రాక నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి స్వామివారికి పూజలు నిర్వహించి, ఏర్పాటు చేసిన కార్తీక దీపాలను వెలిగించనున్నారు.

 

Bhakthi TV LIVE : Koti Deepotsavam 2024 - కాశీ శ్రీ విశ్వేశ్వర విశాలాక్షి కల్యాణం | Non-Stop Live