Minister Kishan Reddy: కుటుంబ సమేతంగా పుణ్యస్నానం చేసిన కేంద్ర మంత్రి
- భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ధార్మిక సమ్మేళనాల్లో మహా కుంభమేళకు ప్రత్యేకమైన స్థానం
- ప్రపంచం నలుమూలల నుండి కోట్ల సంఖ్యలో పాల్గొంటున్న భక్తులు
- కుటుంబ సమేతంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kishan Reddy: భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ధార్మిక సమ్మేళనాల్లో మహా కుంభమేళా ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహోత్సవం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా పరిగణించబడుతుంది. ప్రపంచం నలుమూలల నుండి కోట్ల సంఖ్యలో భక్తులు ఈ మహామేళాకు తరలి వస్తున్నారు. గంగ, యమునా, సరస్వతీ నదుల సంగమ స్థానంలో పుణ్యస్నానం ఆచరించడం ద్వారా మోక్షాన్ని పొందుతారనే విశ్వాసంతో భక్తజనం ఉత్సాహంగా పాల్గొంటారు.
Read Also: AP Cabinet: ఢిల్లీకి సీఎం.. ఏపీ కేబినెట్ భేటీ వాయిదా
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
ప్రయాగరాజ్ కుంభమేళా సందర్భంగా.. భారత కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “కుంభమేళా మహోత్సవంలో స్నానం చేయడం ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది” అని అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటైన కుంభమేళా, సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెబుతోందని ఆయన పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తులు కుంభమేళా సందర్భంగా స్నానం ఆచరిస్తూ తమ ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడం, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల పెరుగుతున్న భక్తిభావానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు.
Read Also: Vijayawada Metro Project: స్పీడందుకున్న విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పనులు..!
ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని, దేశ ప్రజలందరికీ సుఖశాంతులు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. కుంభమేళా వంటి ధార్మిక ఉత్సవాలు భారతదేశ సాంస్కృతిక వైభవానికి ప్రతిబింబమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. కుంభమేళా హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన సమాగమంగా ప్రసిద్ధి పొందింది. ఈ కుంభమేళాలో స్నానం చేయడం వలన పాప విమోచనం కలుగుతుందని విశ్వసిస్తారు. ప్రత్యేకంగా 2025 మహా కుంభమేళా మరింత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.
తాజావార్తలు
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
-
CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!