Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Union Minister Kishan Reddy Fires On Cm Kcr

Kishan Reddy : కేసిఆర్ కుటుంబ సభ్యులు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు

Published Date :September 30, 2022 , 3:46 pm
By Gogikar Sai Krishna
Kishan Reddy : కేసిఆర్ కుటుంబ సభ్యులు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. తొలి విడత మోడీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్ఖితులు, పరిణామాలు, స్థానికంగా లభ్యమయ్యే ముడి ఇనుము నాణ్యతలపై కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిందని ఆయన అన్నారు. 200 మిలియన్ టన్నుల ముడి ఇనుప ఖనిజం లభ్యమయ్యే అవకాశం ఉంటేనే ఉక్కు కర్మాగారం నెలకొల్పాలని, ముడి ఇనుప ఖనిజం నాణ్యత లేకపోవడంతో, తగినంత ఖనిజ నిక్షేపాలు కూడా లేకపోవటంతో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడం లాభదాయకం కాదని కమిటీ పేర్కొందని ఆయన వెల్లడించారు.

 

2018 లోనే బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు లాభదాయకం కాదని, చెయ్యలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని, ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై ప్రజలకు కేసీఆర్, కేటీఆర్‌లే వాగ్దానం చేశారని, ప్రజా సమస్యలు గాలికొదిలేసి, అధికార టీఆర్ఎస్ వీధి నాటకాలు ఆడుతోందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారంటూ ఆయన విమర్శించారు. “తెలంగాణ మోడల్” అని గొప్పగా చెప్పుకుంటూ, సగం రోజులు ప్రగతి భవన్ లో, సగం రోజులు ఫామ్ హౌస్ లో ఉంటున్న మీకు ఏం చూసి దేశ ప్రజలు స్వాగతం పలకాలి అని ఆయన ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం ధర్నాలు, నిరసనలు చేయాల్సిన అవసరం లేదని మరో కేసీఆర్ కుటుంబ సభ్యుడు అంటారని, రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు కర్మాగారం నెలకొల్పి, 10 వేల మందికి ఉపాధి కలిపిస్తామని కేసిఆర్ వాగ్దానం చేశారన్నారు.

 

చేతనైతే, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఉక్కు కర్మాగారం కేసీఆర్ నెలకొల్పాలని, కల్వకుంట కుటుంబీకులు ఇష్టానుసారంగా ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని, ఉన్న వాస్తవాలు చెబితే, నా దిష్టి బొమ్మలు ఎందుకు తగులబెట్టారో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల ఆక్రమణలు, గులాబీ దండు దోపిడీ లు పెచ్చుమీరిపోయాయని, భూవివాదాలకు సంబంధించి నాలుగు లక్షల దరఖాస్తులు దాఖలైతే, ప్రభుత్వం పరిష్కరించలేని అసమర్ధతతో ఉందని ఆయన ధ్వజమెత్తారు. పెద్ద ఎత్తున కేంద్ర అవార్డులు వచ్చాయని, కేసీఆర్ కుటుంబం నుంచి, అధికార టీఆర్ఎస్ నుంచి ప్రజలు తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ కానీ మోడీ ప్రభుత్వం కానీ ఉక్కు కర్మాగారం పై ఏలాంటి హామీ ఇవ్వలేదని, హామీలు ఇచ్చి, వాగ్దానాలు చేసి తప్పించుకునే అలవాటు బీజేపీకి లేదని ఆయన స్పష్టం చేశారు.

 

తెలంగాణను ఏం ఉద్ధరించామని, ఇప్పుడు జాతీయ పార్టీ అంటున్నారని, టీఆర్ఎస్, మజ్లీస్ పార్టీ లు ప్రజాధనం దోచుకోవడం తప్పితే, చేసేదేమి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవింగ్ సీటులో మాత్రమే కేసిఆర్ కూర్చున్నారు. స్టీరింగ్, బ్రేకు, ఎక్సలరేటర్ మొత్తం మా చేతుల్లోనే ఉందని మీ మిత్ర పక్షం మజ్లీస్ నాయకుడే చెప్పారు. తెలంగాణను దోచుకుంది చాలక, ఇప్పుడు దేశం మీద పడి దోచుకునేందుకు ఊరేగే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని ప్రజలకు వాగ్దానం చేస్తూ మాట్లాడిన వీడియో క్లిప్పింగులను కేంద్ర మంత్రి ప్రదర్శించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • bjp
  • breaking news
  • cm kcr
  • latest news

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions