Minister Kishan Reddy: తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి మిగిలేది గాడిది గుడ్డే
- పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో వేడెక్కిన రాజకీయాలు.
- పట్టభద్రులతో సమావేశంకు హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై ధ్వజమెత్తిన మంత్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kishan Reddy: పట్టభద్రుల ఎన్నికలు దెగ్గరపడడంతో ఎన్నికలు జరిగే ఆయా జిల్లాలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలోనే అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టభద్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై ఆయన తీవ్రంగా స్పందించారు. మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఆదాయంపై అంచనా లేకుండా నిర్లక్ష్యంగా ఖర్చులు చేసి రాష్ట్రాన్ని తీవ్ర అప్పుల బారిన పడేసిందని విమర్శించారు. రాష్ట్రం ఇప్పటికే 9 లక్షల కోట్ల రూపాయల అప్పుల లో మునిగిపోయిందని, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అంతేకాదు, కాంట్రాక్టర్ల బిల్లులు కూడా చెల్లించని ప్రభుత్వం, రాష్ట్ర ప్రాజెక్టులను పూర్తిచేయలేకపోతుందని ఆయన ఆరోపించారు.
Read Also: Yadagirigutta: ఘనంగా మహా కుంభాభిషేకం.. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరు
Also Read
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
రాష్ట్రంలో పరిస్థితి ఇంత దిగజారిపోయిందని, కనీసం వీధిలో లైట్లు కాలిపోతే కొత్త లైట్లు వేయలేని స్థితికి రాష్ట్ర ప్రభుత్వం చేరుకుందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ తన కుటుంబ కేంద్రంగా పాలన సాగించాడని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సోనియా కుటుంబానికి అనుకూలంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ రంగం కుదేలవుతోందని, బిల్డర్ల పని పూర్తిగా నిలిచిపోయిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తూ వాటాలు, ఫ్లోర్లు అడుగుతున్నారని ఆరోపించారు. కొత్త భవనాలకు అనుమతులు ఇవ్వకపోవడంతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం నష్టాల్లో పడిపోయిందని ఆయన చెప్పారు.
ఈ పరిస్థితి చూస్తుంటే.. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి మిగిలేది గాడిది గుడ్డు, ఓటమి మాత్రమే అని ధ్వజమెత్తారు. ప్రజలు కాంగ్రెస్ పాలనను పూర్తిగా తిరస్కరిస్తున్నారని, పార్టీకి భవిష్యత్తు లేదని స్పష్టం చేశారు. సమావేశంలో పలువురు పట్టభద్రులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు పూర్తి మద్దతు ఇవ్వాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..