Gajendra Singh Shekhawat: రిజర్వాయర్లను కాపాడుతున్నాం.. ప్రతీ నీటి బొట్టును వినియోగించే మెకానిజం జరగాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gajendra Singh Shekhawat: ప్రతీ నీటి బొట్టును తిరిగి వినియోగించేలా సమర్థ మెకానిజం జరగాలి ఆకాక్షించారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. విశాఖపట్నంలో 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) కాంగ్రెస్ ప్లీనరీని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికీ ఇండియాలో 65 శాతం వ్యవసాయం భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉందన్నారు. భూగర్భ జలాల నిర్వహణ కోసం కేంద్రం అనేక కార్యక్రమాలను చేపడుతోందన్న ఆయన.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీటి నిల్వల నిర్వహణ జరగాలన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఇరిగేషన్పై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నాం అన్నారు షెకావత్.. ప్రపంచ దేశాలకు భారత్ అతిపెద్ద ఎగుమతిదారుగా వృద్ధి చెందుతోందని.. వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నాం అని వెల్లడించారు.. కేంద్ర ప్రభుత్వం నీటి సంరక్షణ చర్యలు చేపడుతోంది.. రైతులకు మేలు జరిగేలా నీటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాం.. భూగర్భ జలాల సంరక్షణకు సరైన ప్రణాళికలు రూపొందిస్తున్నాం అన్నారు.. నీటిని పొదుపుగా వాడితేనే భవిష్యత్ తరాలను ఉపయోగంగా ఉంటుందని పేర్కొన్నారు. వాటర్ రీసైక్లింగ్ విధానంతో మురికినీటిని శుద్ది చేస్తున్నాం.. తాగు, సాగునీటికి ఇబ్బంది కలగకుండా సరైన చర్యలు చేపడుతున్నాం అని వెల్లడించారు..
Also Read
- Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
నీటి సంరక్షణ కోసం 2019లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జలశక్తి అభియాన్ ప్రారంభించామని గుర్తు చేశారు షెకావత్.. జలశక్తి అభియాన్తో మెరుగైన ఫలితాలు వస్తున్నాయన్న ఆయన.. నదుల అనుసంధాన ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోందన్నారు.. ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో నదులను అనుసంధానం చేస్తున్నాం.. అంతేకాకుండా డ్యామ్ సేఫ్టీ యాక్ట్ల ద్వారా డ్యామ్ల పరిరక్షణ చేపట్టాం.. డ్యాం సేఫ్టీ యాక్ట్ ను తీసుకొచ్చి రిజర్వాయర్ లను మోడీ ప్రభుత్వం సురక్షితంగా కాపాడుతోందని వెల్డించారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.
తాజావార్తలు
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
-
Gold and Silver Rates: కమింగ్ డౌన్.. నేడు మళ్లీ పతనమైన గోల్డ్, సిల్వర్ ధరలు..
-
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..