ఇరాన్పై యుద్ధానికి మొదటి నుంచి అమెరికాకు సహకరించేందుకు బ్రిటన్ వెనుకంజ వేసింది. ట్రంపే స్వయంగా ఫోన్ చేసి వైమానిక స్థావరాలు అప్పగించాలని అడిగినా కూడా యూకే ప్రభుత్వం నిరాకరించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. గత నెల 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. దీంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న గ్యాస్, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. దీంతో పెద్ద ఎత్తున ఆయా దేశాలకు చెందిన ఆయిల్ ట్యాంకర్లు దిగ్బంధించబడ్డాయి. పైగా ఖతార్లోనే అతి పెద్ద గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ దాడి చేయడంతో ప్రపంచ దేశాల్లో గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ముఖ్యంగా ఐరోపా దేశాలు విలవిలలాడుతున్నాయి. ఈ పరిణామాలతో ఐరోపా దేశాలు తమ ఆలోచన విధానాన్ని మార్చుకున్నాయి. హార్ముజ్ కోసం ఇరాన్కు వ్యతిరేకంగా జపాన్, ఐరోపా దేశాలు ఏకమయ్యాయి.
ఇప్పుడు తాజాగా హార్ముజ్ జలసంధిని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ స్థావరాలపై దాడి చేసేందుకు తమ స్థావరాలను ఉపయోగించుకునేందుకు అమెరికాకు యూకే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో స్థావరాలు ఇచ్చేందుకు నిరాకరించిన బ్రటిన్.. ఇప్పుడు పరిస్థితులు చేదాటడంతో అమెరికాకు కీర్ స్టార్మర్ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
ఇరాన్ ఖండన..
అమెరికాకు స్థావరంలోకి ప్రవేశం కల్పించడం ద్వారా బ్రిటిష్ ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని యూకేను ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ తన ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటుందని వార్నింగ్ ఇచ్చింది. అయినా ఇరాన్తో యుద్ధం చేయడం యూకే ప్రజలకు ఏ మాత్రం ఇష్టం లేదని.. కానీ ఇప్పుడు సొంత ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం ఏ మాత్రం భావ్యం కాదని ఇరాన్ సూచించింది.
UK approves US to use its bases to attack Iranian sites targeting Strait of Hormuz
Read @ANI Story | https://t.co/FJzGXOzzvK #UK #US #bases #IranianSites #Iran #StraitofHormuz pic.twitter.com/A0atUXma75
— ANI Digital (@ani_digital) March 20, 2026