Marathan Runner : పారిస్ ఒలింపిక్ క్రీడాకారిణి పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ప్రియుడు.. చికిత్స పొందుతూ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marathan Runner : పారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న ఉగాండా క్రీడాకారిణి రెబెక్కా చెప్టెగీ గురువారం విషాదకరంగా మరణించింది. రెబెక్కా ప్రియుడు ఆమెపై పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. దాని కారణంగా ఆమె శరీరం 75 శాతానికి పైగా కాలిపోయింది. రెబెక్కా పరిస్థితి విషమంగా ఉండటంతో కెన్యాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. రెబెక్కా చెప్టెగై 2024 పారిస్ ఒలింపిక్స్లో 44వ ర్యాంక్తో పాటు పతకం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ ఆమె మాజీ ప్రియుడు ఆమె కలలను నాశనం చేశాడు. రెబెక్కా చెప్టేగై హత్య కారణంగా ఉగాండాలో శోకం అలముకుంది. ఆమె మాజీ ప్రియుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెబెక్కా మరణం పట్ల ఆమె కుటుంబం, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు న్యాయం జరగాలని కోరుతున్నారు.
Read Also;Astrology: సెప్టెంబర్ 06, శుక్రవారం దినఫలాలు
Also Read
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
We have learnt of the sad passing on of our Olympic athlete Rebecca Cheptegei OLY following a vicious attack by her boyfriend. May her gentle soul rest in peace and we strongly condemn violence against women. This was a cowardly and senseless act that has led to the loss of a… pic.twitter.com/V8Mog3oMOX
— Donald Rukare (@drukare) September 5, 2024
ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఏం చెప్పారు?
ఈ సంఘటనపై, ఉగాండా ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు డొనాల్డ్ రుకారే సోషల్ మీడియాలో రాశారు. మన ఒలింపిక్ అథ్లెట్ రెబెక్కా చెప్టేగై ఇక లేరు అనే బాధాకరమైన వార్త మాకు అందింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామని అన్నారు.
ఇద్దరి మధ్య కొనసాగుతున్న వివాదం
భూమి విషయంలో క్రీడాకారిణికి, ఆమె మాజీ ప్రియుడికి మధ్య వివాదం నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై ఇంకా విచారణ కొనసాగుతోంది. చెప్టేగై తండ్రి జోసెఫ్ తన కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత ఏడాది జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో రెబెక్కా 14వ స్థానంలో నిలిచింది. అదే సమయంలో, 2022 సంవత్సరంలో ఆమె థాయ్లాండ్లో జరిగిన వరల్డ్ మౌంటైన్, ట్రైల్ రన్నింగ్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్నారు.
తాజావార్తలు
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?