Marathan Runner : పారిస్ ఒలింపిక్ క్రీడాకారిణి పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ప్రియుడు.. చికిత్స పొందుతూ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marathan Runner : పారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న ఉగాండా క్రీడాకారిణి రెబెక్కా చెప్టెగీ గురువారం విషాదకరంగా మరణించింది. రెబెక్కా ప్రియుడు ఆమెపై పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. దాని కారణంగా ఆమె శరీరం 75 శాతానికి పైగా కాలిపోయింది. రెబెక్కా పరిస్థితి విషమంగా ఉండటంతో కెన్యాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. రెబెక్కా చెప్టెగై 2024 పారిస్ ఒలింపిక్స్లో 44వ ర్యాంక్తో పాటు పతకం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ ఆమె మాజీ ప్రియుడు ఆమె కలలను నాశనం చేశాడు. రెబెక్కా చెప్టేగై హత్య కారణంగా ఉగాండాలో శోకం అలముకుంది. ఆమె మాజీ ప్రియుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెబెక్కా మరణం పట్ల ఆమె కుటుంబం, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు న్యాయం జరగాలని కోరుతున్నారు.
Read Also;Astrology: సెప్టెంబర్ 06, శుక్రవారం దినఫలాలు
Also Read
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
We have learnt of the sad passing on of our Olympic athlete Rebecca Cheptegei OLY following a vicious attack by her boyfriend. May her gentle soul rest in peace and we strongly condemn violence against women. This was a cowardly and senseless act that has led to the loss of a… pic.twitter.com/V8Mog3oMOX
— Donald Rukare (@drukare) September 5, 2024
ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఏం చెప్పారు?
ఈ సంఘటనపై, ఉగాండా ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు డొనాల్డ్ రుకారే సోషల్ మీడియాలో రాశారు. మన ఒలింపిక్ అథ్లెట్ రెబెక్కా చెప్టేగై ఇక లేరు అనే బాధాకరమైన వార్త మాకు అందింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామని అన్నారు.
ఇద్దరి మధ్య కొనసాగుతున్న వివాదం
భూమి విషయంలో క్రీడాకారిణికి, ఆమె మాజీ ప్రియుడికి మధ్య వివాదం నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై ఇంకా విచారణ కొనసాగుతోంది. చెప్టేగై తండ్రి జోసెఫ్ తన కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత ఏడాది జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో రెబెక్కా 14వ స్థానంలో నిలిచింది. అదే సమయంలో, 2022 సంవత్సరంలో ఆమె థాయ్లాండ్లో జరిగిన వరల్డ్ మౌంటైన్, ట్రైల్ రన్నింగ్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్నారు.
తాజావార్తలు
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్కు కౌంట్డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్తో వస్తోన్న అల్లు అర్జున్
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
ట్రెండింగ్
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!