Ebola Virus: ఎబోలా వ్యాప్తికి ముగింపు పలికిన ఉగాండా.. ఇప్పటివరకు 55 మంది బలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ebola Virus: దాదాపు నాలుగు నెలల క్రితం ఉద్భవించి 55 మంది ప్రాణాలను బలిగొన్న ఎబోలా వైరస్ వ్యాప్తికి ముగింపు పలికినట్లు ఉగాండా బుధవారం ప్రకటించింది. ఉగాండాలో ఎబోలా వ్యాప్తిని విజయవంతంగా నియంత్రించామని ఆ దేశ ఆరోగ్య మంత్రి జేన్ రూత్ అసెంగ్ సెంట్రల్ జిల్లా ముబెండేలో జరిగిన ఒక వేడుకలో చెప్పారు. ఇక్కడ ఈ వ్యాధి మొదట సెప్టెంబర్లో కనుగొనబడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వ్యాధి నియంత్రణకు చేపట్టిన చర్యలను ఓ ప్రకటనలో ప్రశంసించింది.
అంటువ్యాధి ప్రారంభమైనప్పటి నుంచి జనవరి 11 నాటికి 113 రోజులు గడిచాయని, ఇది రాజధాని కంపాలాకు కూడా వ్యాపించిందని మంత్రి జేన్ రూత్ అసెంగ్ చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం 42 రోజులు కొత్త కేసులు లేనప్పుడు వ్యాధి వ్యాప్తి అధికారికంగా ముగుస్తుంది. నిఘా, కాంటాక్ట్ ట్రేసింగ్, ఇన్ఫెక్షన్, నివారణ, నియంత్రణ వంటి కీలక నియంత్రణ చర్యలను పెంచడం ద్వారా ఉగాండా ఎబోలా వ్యాప్తికి వేగంగా ముగింపు పలికిందని డబ్ల్యూహెచ్వో పేర్కొంది.
Also Read
- Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
- Mallikarjun Kharge: లోక్సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
- TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
అంటువ్యాధి కేంద్రంగా ఉన్న రెండు జిల్లాలైన ముబెండే, కస్సాండా జిల్లాలు డిసెంబర్ మధ్యకాలం వరకు రెండు నెలల పాటు లాక్డౌన్లో ఉంచబడ్డాయి, అయితే ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇలాంటి చర్యలను విధించలేదు. మొత్తంగా 142 కేసులు నమోదు కాగా, 55 మరణాలు సంభవించాయి. 87 మంది రోగులు కోలుకున్నారు. బాధితుల్లో పిల్లలు కూడా ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. చివరిగా ధృవీకరించబడిన రోగి నవంబర్ 30న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు.
Suicide Attack: కాబూల్లో ఆత్మాహుతి దాడి.. 20 మందికి పైగా మృతి!
ఉగాండా వ్యాప్తి సూడాన్ ఎబోలా వైరస్ వల్ల సంభవించింది. ఇది ఎబోలా వైరస్ ఆరు జాతులలో ఒకటి. దీనికి ప్రస్తుతం ధృవీకరించబడిన టీకా లేదు. ప్రస్తుతం మూడు టీకాలు ఉగాండాలో ట్రయల్ చేయబడుతున్నాయి. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, బ్రిటన్లోని జెన్నర్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకా, యునైటెడ్ స్టేట్స్లోని సబిన్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ నుంచి మరొకటి, ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్ (IAVI) నుంచి మూడోది ట్రయల్లో ఉన్నాయి. ఇది ఉగాండాలో ఏడో వ్యాప్తి అని, సుడాన్ వైరస్ వల్ల ఐదోది అని మంత్రి అసెంగ్ చెప్పారు.
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఒక నదికి ఎబోలా పేరు పెట్టారు. దీనిని గతంలో జైర్ అని పిలిచేవారు. ఇక్కడ 1976లో కనుగొనబడింది. మానవునికి శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. ప్రధాన లక్షణాలు జ్వరం, వాంతులు, రక్తస్రావం, విరేచనాలు. ముఖ్యంగా పట్టణ పరిసరాలలో వ్యాప్తి చెందడం కష్టం. వ్యాధి సోకిన వ్యక్తులు రెండు నుంచి 21 రోజుల మధ్య పొదిగే కాలం తర్వాత లక్షణాలు కనిపించే వరకు అంటువ్యాధి ఉన్నట్లు తెలియదు. పశ్చిమ ఆఫ్రికాలో 2013, 2016 మధ్య అత్యంత భయంకరమైన అంటువ్యాధి బయటపడింది. దాదాపు 11,300 మందికి పైగా మరణించారు.
తాజావార్తలు
-
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
-
Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
-
Kishan Reddy : జీవో 97పై బీజేపీ ఫైర్.. విద్యార్థులకు అండగా కిషన్ రెడ్డి.!
-
Mallikarjun Kharge: లోక్సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
-
TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!