Ebola Virus: ఎబోలా వ్యాప్తికి ముగింపు పలికిన ఉగాండా.. ఇప్పటివరకు 55 మంది బలి
Ebola Virus: దాదాపు నాలుగు నెలల క్రితం ఉద్భవించి 55 మంది ప్రాణాలను బలిగొన్న ఎబోలా వైరస్ వ్యాప్తికి ముగింపు పలికినట్లు ఉగాండా బుధవారం ప్రకటించింది. ఉగాండాలో ఎబోలా వ్యాప్తిని విజయవంతంగా నియంత్రించామని ఆ దేశ ఆరోగ్య మంత్రి జేన్ రూత్ అసెంగ్ సెంట్రల్ జిల్లా ముబెండేలో జరిగిన ఒక వేడుకలో చెప్పారు. ఇక్కడ ఈ వ్యాధి మొదట సెప్టెంబర్లో కనుగొనబడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వ్యాధి నియంత్రణకు చేపట్టిన చర్యలను ఓ ప్రకటనలో ప్రశంసించింది.
అంటువ్యాధి ప్రారంభమైనప్పటి నుంచి జనవరి 11 నాటికి 113 రోజులు గడిచాయని, ఇది రాజధాని కంపాలాకు కూడా వ్యాపించిందని మంత్రి జేన్ రూత్ అసెంగ్ చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం 42 రోజులు కొత్త కేసులు లేనప్పుడు వ్యాధి వ్యాప్తి అధికారికంగా ముగుస్తుంది. నిఘా, కాంటాక్ట్ ట్రేసింగ్, ఇన్ఫెక్షన్, నివారణ, నియంత్రణ వంటి కీలక నియంత్రణ చర్యలను పెంచడం ద్వారా ఉగాండా ఎబోలా వ్యాప్తికి వేగంగా ముగింపు పలికిందని డబ్ల్యూహెచ్వో పేర్కొంది.
Also Read
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
అంటువ్యాధి కేంద్రంగా ఉన్న రెండు జిల్లాలైన ముబెండే, కస్సాండా జిల్లాలు డిసెంబర్ మధ్యకాలం వరకు రెండు నెలల పాటు లాక్డౌన్లో ఉంచబడ్డాయి, అయితే ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇలాంటి చర్యలను విధించలేదు. మొత్తంగా 142 కేసులు నమోదు కాగా, 55 మరణాలు సంభవించాయి. 87 మంది రోగులు కోలుకున్నారు. బాధితుల్లో పిల్లలు కూడా ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. చివరిగా ధృవీకరించబడిన రోగి నవంబర్ 30న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు.
Suicide Attack: కాబూల్లో ఆత్మాహుతి దాడి.. 20 మందికి పైగా మృతి!
ఉగాండా వ్యాప్తి సూడాన్ ఎబోలా వైరస్ వల్ల సంభవించింది. ఇది ఎబోలా వైరస్ ఆరు జాతులలో ఒకటి. దీనికి ప్రస్తుతం ధృవీకరించబడిన టీకా లేదు. ప్రస్తుతం మూడు టీకాలు ఉగాండాలో ట్రయల్ చేయబడుతున్నాయి. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, బ్రిటన్లోని జెన్నర్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకా, యునైటెడ్ స్టేట్స్లోని సబిన్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ నుంచి మరొకటి, ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్ (IAVI) నుంచి మూడోది ట్రయల్లో ఉన్నాయి. ఇది ఉగాండాలో ఏడో వ్యాప్తి అని, సుడాన్ వైరస్ వల్ల ఐదోది అని మంత్రి అసెంగ్ చెప్పారు.
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఒక నదికి ఎబోలా పేరు పెట్టారు. దీనిని గతంలో జైర్ అని పిలిచేవారు. ఇక్కడ 1976లో కనుగొనబడింది. మానవునికి శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. ప్రధాన లక్షణాలు జ్వరం, వాంతులు, రక్తస్రావం, విరేచనాలు. ముఖ్యంగా పట్టణ పరిసరాలలో వ్యాప్తి చెందడం కష్టం. వ్యాధి సోకిన వ్యక్తులు రెండు నుంచి 21 రోజుల మధ్య పొదిగే కాలం తర్వాత లక్షణాలు కనిపించే వరకు అంటువ్యాధి ఉన్నట్లు తెలియదు. పశ్చిమ ఆఫ్రికాలో 2013, 2016 మధ్య అత్యంత భయంకరమైన అంటువ్యాధి బయటపడింది. దాదాపు 11,300 మందికి పైగా మరణించారు.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!