Udupi Crime: ఆటోలో వచ్చి.. నలుగురిని హత్య చేసిన దుండగుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
4 members of a family were stabbed to death in Udupi: కర్ణాటకలోని ఉడుపిలో దారుణం చోటుచేసుకుంది. నేజారు సమీపంలోని తృప్తినగరలో ఓ కుటుంబానికి చెందిన నలుగురిని గుర్తుతెలియని దుండగుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. ముసుగు ధరించిన వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి.. పావుగంటలోనే అందరిని హతమార్చి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..
తృప్తినగరలో హసీనా (46) తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోంది. హసీనా భర్త విదేశాల్లో ఉంటుండగా.. ఆమె ఇక్కడే పిల్లలను చూసుకుంటోంది. ఆదివారం తెల్లవారుజామున తెల్లని మాస్కు ధరించి వచ్చిన వ్యక్తి.. ఇంటి ఆవరణలో నిలబడి ఉన్న హసీనాపై కత్తితో దాడి చేశాడు. ఆపై ఇంట్లోకి వెళ్లి అఫ్నాన్ (23), అయ్నాజ్ (21), ఆసిం (12)లను కత్తితో పొడిచి హత్య చేశాడు. హసీనా ఇంట్లో అరుపులు విన్న పొరుగింటి యువతి ఆసిమ్ పరుగెత్తుకు రాగా.. ఆమెపై కూడా నిందితుడు దాడి చేశాడు. ఆపై అతడు పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆసిమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Also Read
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
పావుగంటలోనే హసీనా కుటుంబంను హత్య చేసిన దుండగుడు తాను వచ్చిన ఆటోలోనే పరారయ్యాడు. తృప్తినగర ఆటో స్టాండ్ వద్ద బైకు పెట్టిన నిందితుడు.. శ్యామ్ అనే వ్యక్తి ఆటోలో హసీనా ఇంటికి వచ్చాడు. హత్య తర్వాత ఆటోస్టాండ్కు వెళ్లి.. తన బైకుపై పరారయ్యాడు. నిందితునికి సుమారుగా 45 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు గుర్తించారు. ఉడిపి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. హత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!