Uber: ఉబర్ క్యాబ్ ఎక్కి అమెరికాకు వెళ్లిన 800 మంది భారతీయులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uber: అమెరికాలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి మూడేళ్లకు పైగా జైలు శిక్ష పడింది. ఉబర్ ట్యాక్సీ ద్వారా 800 మంది అక్రమంగా భారతీయులను అమెరికాకు తీసుకొచ్చారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. మానవ అక్రమ రవాణా, మనీలాండరింగ్ కేసులో వ్యక్తికి 45 నెలల కఠిన కారాగార శిక్ష విధించబడింది. కెనడా సరిహద్దు నుంచి భారత పౌరులను అక్రమంగా అమెరికాలోకి చేర్చేవాడని.. ఇందుకోసం ప్రజల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి.
Read Also:Rashmika Mandanna : రష్మిక ఆ ఒక్కరోజు ఫ్రెండ్స్ తో ఆ పని చేస్తుందా..?
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. 'బేబీ బాస్'ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
- Passport Row: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
- Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
ఈ వ్యక్తి పేరు రాజిందర్ పాల్ సింగ్. అతను అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసించాడు. మనీ స్మగ్లింగ్, మనీలాండరింగ్ కేసులో రాజిందర్ పాల్ సింగ్కు యుఎస్ జిల్లా కోర్టు మంగళవారం 45 నెలల జైలు శిక్ష విధించింది. స్మగ్లింగ్ రాకెట్లో కీలక సభ్యుడిగా ఉన్న రాజిందర్ పాల్ సింగ్ వందలాది మంది భారతీయ పౌరులను కెనడా నుంచి సరిహద్దులు దాటించేందుకు సహకరించాడని అమెరికా న్యాయ శాఖ తన నిర్ణయంలో పేర్కొంది. ఇందుకుగాను అతను పౌరుల నుండి 5లక్షల అమెరికా డాలర్ల కంటే ఎక్కువ ఫీజుగా తీసుకున్నాడు. గత నాలుగేళ్లలో 800 మందికి పైగా భారతీయ పౌరులను ఉత్తర సరిహద్దు, వాషింగ్టన్ గుండా అమెరికాలోకి అక్రమంగా తరలించడంలో రాజిందర్ సింగ్ సహకరించాడని అమెరికా తాత్కాలిక అటార్నీ టెస్సా ఎం. గోర్మన్ తెలిపారు.
Read Also:Health Tips : కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తప్పనిసరిగా వీటిని తీసుకోవాలి..!
వారి ఈ చర్య వాషింగ్టన్ భద్రతకు మాత్రమే కాకుండా, భారతదేశం నుండి అమెరికాకు స్మగ్లింగ్లో తీసుకువచ్చిన వ్యక్తుల భద్రతకు కూడా ముప్పు అని పేర్కొన్నారు. నిందితులు అమెరికాలో మెరుగైన జీవితం కోసం ఎదురుచూస్తున్న ప్రజల ఆశలను బద్దలు కొట్టారు. రాజిందర్ పాల్ సింగ్పై 70వేల అమెరికా డాలర్ల భారీ జరిమానా కూడా విధించారు. జూలై 2018 నుండి, రాజిందర్ సింగ్, అతని సహచరులు కెనడాలోని సీటెల్ ప్రాంతంలో చట్టవిరుద్ధంగా సరిహద్దును దాటుతున్న వ్యక్తుల కోసం ఉబెర్ను ఉపయోగించారు. 2018- 2022 మధ్య నిందితులు వ్యక్తుల అక్రమ రవాణా కోసం 600 ట్రిప్పులు చేశారు. విచారణలో నిందితుడి నివాసం నుండి 45వేల డాలర్లు, కొన్ని నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రాజిందర్ పాల్ సింగ్ కూడా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నాడు.
తాజావార్తలు
-
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. ‘బేబీ బాస్’ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
-
Passport Row: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
-
Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!