Fire In Bus : సూర్యాపేట జిల్లాలోని దురాజ్ పల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. చివ్వెంల మండలం గంపుల గ్రామ శివారులో ఏపీకి చెందిన రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. అయితే బస్సులో ఎవరూలేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గంపుల గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు ఆగిపోయింది. దీంతో సిబ్బంది అందులో ఉన్న ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. అయితే నిలిచిపోయిన బస్సును రిపేర్ చేయడానికి సిబ్బంది మరో బస్సులో వచ్చారు. ఈ క్రమంలో ఆగిపోయిన బస్సులో ఉన్న బ్యాటరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఒక బస్సు నుంచి మరో బస్సుకు వేగంగా మంటలు వ్యాపించడంతో రెండూ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Fire In Bus : సూర్యాపేట జిల్లాలో తప్పిన ప్రమాదం.. రెండు బస్సులు బుగ్గి

Bus 2