Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా దళాలు

  • దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో రెండు చోట్ల..
  • ఉగ్రవాదులు - భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్.
  • ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా దళాలు.
Encounter

Encounter

Encounter: శనివారం (2 అక్టోబర్ 2024) దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో రెండు చోట్ల ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. కోకర్నాగ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. ఇది కాకుండా, అనంతనాగ్‌లోని కచ్వాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్‌కౌంటర్ స్థలంలో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. శనివారం తెల్లవారుజామున శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఖన్యార్ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దాంతో ఉదయం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత భద్రతా బలగాలు కూడా ప్రతీకారం తీర్చుకోవడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారింది.

Also Read: IND vs NZ: స్వల్ప ఆధిక్యంలో టీమిండియా.. 263 ఆలౌట్

శ్రీనగర్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయని.. అయితే ఇప్పటి వరకు ఇరువైపులా ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. ఇకపోతే, అంతకుముందు సోమవారం (28 అక్టోబర్ 2024) జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్ ప్రాంతంలో ఉగ్రవాదులు సైనిక వాహనంపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత అక్కడ ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. దీని తరువాత, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడం ద్వారా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది. దీని కోసం అదనపు భద్రతా బలగాలను ఆ ప్రాంతానికి పంపారు. మరోవైపు గుల్‌మార్గ్ సమీపంలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. అక్కడ ఇద్దరు సైనికులు, ఇద్దరు స్థానిక పోర్టర్‌లు మరణించారు. ఈ దాడిలో గాయపడిన మరో సైనికుడు మరుసటి రోజు మరణించడంతో మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది.

IND vs UAE: ఒక్క పరుగుతో యూఏఈ చేతిలో ఓడిన టీమిండియా