U19 World Cup 2024 India Squad: అండర్-19 ప్రపంచకప్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం దుబాయ్లో అండర్-19 ఆసియాకప్ 2023లో పాల్గొంటున్న జట్టునే మెగా టోర్నీకి ఎంపిక చేసింది. ప్రపంచకప్ జట్టుకు పంజాబ్కు చెందిన ఉదయ్ సహరన్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. మధ్యప్రదేశ్కు చెందిన సౌమ్య్కుమార్ పాండే వైస్ కెప్టెన్గా అవకాశం దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు ప్రపంచకప్ జరగనుంది.
అండర్-19 ప్రపంచకప్ జట్టులో ఇద్దరు తెలుగు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. హైదరాబాద్కు చెందిన అరవెల్లి అవినాశ్ రావు, మురుగన్ అభిషేక్ ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యారు. అవినాశ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కాగా.. అభిషేక్ స్పిన్ ఆల్రౌండర్. ఈ ఇద్దరు ఆసియాకప్ 2023లో భారత్ ఆడిన 3 మ్యాచ్లలోనూ బరిలోకి దిగారు. ప్రపంచకప్ 2024కు ముందు దక్షిణాఫ్రికాలో జరిగే ట్రై-సిరీస్లో కూడా ఇదే జట్టు ఆడనుంది. భారత్, దక్షిణాఫ్రికా మరియు ఇంగ్లండ్ టీమ్స్ ట్రై-సిరీస్లో పాల్గొంటాయి.
Also Read: Suryakumar Yadav: అందుకే ఓడిపోయాం: సూర్యకుమార్
అండర్-19 ప్రపంచకప్కు భారత జట్టు:
ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమీ కుమార్ (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్, రుద్రమయూర్ పటేల్, సచిన్, ప్రియాన్షు, ముషీర్ ఖాన్, అవినాశ్ రావు, మురుగన్ అభిషేక్, ఇనేశ్ మహాజన్, ధనుశ్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారి.