NTV Telugu Site icon

Electrical shock: విద్యుత్ షాక్ తో ఇద్దరు రైతులు మృతి

Curent Shock

Curent Shock

కృష్ణాజిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తోట్లవల్లూరు మండలంలోని పాములలంకలో విద్యుత్ షాక్ తో ఇద్దరు రైతులు మృతి చెందారు. పాములలంకకు చెందిన పాముల విజయాంభ, పాముల చిరింజీవిగా గుర్తించారు. దీంతో పాములులంక గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. నిన్న మధ్యాహ్నం పసుపు తోటలో పిండి వేయటానికి వెళ్లిన విజయాంభ, చిరింజీవి.. పొలానికి వేసిన కంచెకు విద్యుత్ ప్రసరించటంతో కంచికి తగిలి ఇద్దరు మృతి చెందారని గ్రామస్తులు భావిస్తున్నారు. ఇద్దరు ఎంత సేపటికీ తిరిగి రాకపోవటంతో గ్రామస్థులు గాలింపు చేపట్టారు. రాత్రి ఒకటిన్నర గంటలకు పొలంలో పడి ఉన్న మృతదేహాలను స్థానికులు కనుగొన్నారు.

Read Also: Road Accident: రోడ్డు ప్రమాదాల నుంచి త్రుటిలో బయటపడ్డ ఇద్దరు మాజీ సీఎంలు!

దీంతో పొలానికి వేసిన కంచెకు కరెంట్ ను తొలగించి ఆ తర్వాత ఇరువురు మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో సంఘటన స్థాలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఇక, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి పోస్ట్ మార్టం కోసం పంపించారు. విభయాంభ, చిరింజీవి మరణాలతో పాములలంకలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.