Chevella Bus Accident: చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన లో ట్విస్ట్.. కారణం అది కాదట..
- చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన లో ట్విస్ట్
- రోడ్డు మలుపు వల్ల ప్రమాదం జరగలేదని పోలీసులు తేల్చి చెప్పారు
- రోడ్డు మీద ఉన్న గుంతను తప్పించేందుకు టిప్పర్ డ్రైవర్ రైట్ కి వచ్చాడని తెలిపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో నవంబర్ 3 (సోమవారం)న ఉదయం హైదరాబాద్ – బీజాపూర్ హైవేపై చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సును కంకర లోడ్ తో ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టిన విషయం తెలిసిందే. బస్సును ఢీకొట్టిన టిప్పర్ దాని పైనే బోల్తా పడడంతో కంకర ప్రయాణికులపై పడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన లో ట్విస్ట్ చోటుచేసుకుంది. రోడ్డు మలుపు వల్ల ప్రమాదం జరగలేదని పోలీసులు తేల్చి చెప్పారు.
Also Read:Adenovirus: నిద్రలేచిన వైరస్ మృగం.. కరోనా కంటే డేంజర్.. ఇది సోకితే..!
Also Read
రోడ్డు మీద ఉన్న గుంతను తప్పించేందుకు టిప్పర్ డ్రైవర్ రైట్ కి వచ్చాడని తెలిపారు. వేగంగా రైట్ సైడ్ రావడంతో బస్సుని టిప్పర్ ఢీ కొట్టిందని వెల్లడించారు. టిప్పరు బస్సును ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ఇద్దరు డ్రైవర్లు ఎవరు కూడా తాగి వాహనాలు నడపలేదని తెలిపారు. చేవెళ్ల బస్సు ప్రమాదంపై విచారణ పూర్తి చేశాం..చార్జ్ షీట్ దాఖలు చేస్తామని పోలీసులు వెల్లడించారు. టిప్పర్ యజమానిని ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చారు. ఓవర్ లోడ్ ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. టిప్పర్ యజమాని లచ్చు నాయక్ పేరును తాజాగా FIR లో చేర్చారు.
ప్రమాద సమయంలో ఓనర్ టిప్పర్ లోనే ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ మృతి చెందగా ఓనర్ గాయాలతో బయటపడ్డాడు. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!