రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో నవంబర్ 3 (సోమవారం)న ఉదయం హైదరాబాద్ – బీజాపూర్ హైవేపై చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సును కంకర లోడ్ తో ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టిన విషయం తెలిసిందే. బస్సును ఢీకొట్టిన టిప్పర్ దాని పైనే బోల్తా పడడంతో కంకర ప్రయాణికులపై పడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన…