Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
- తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో లక పరిణామం
- అత్త గారికి రాష్ట్ర ప్రభుత్వం షాక్
- కీలక పదవి నుంచి తొలగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు హీరోయిన్ ట్విషా శర్మ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్విషా అత్తగారైన గిరిబాలా సింగ్ను భోపాల్ జిల్లా వినియోగదారుల కమిషన్ ఛైర్పర్సన్ పదవి నుంచి మధ్యప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర ఆహార శాఖ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో గిరిబాలా సింగ్ పాత్రపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెపై భోపాల్లోని కటారా హిల్స్ పోలీస్ స్టేషన్లో వరకట్న వేధింపులు, వరకట్న మరణం కేసులు నమోదయ్యాయి. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అధికారిక విచారణకు ఆదేశించింది. మే 20, 2026న ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల పరిరక్షణ శాఖ జారీ చేసిన లేఖలో.. రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ రిజిస్ట్రార్కు విచారణ చేపట్టి అత్యవసరంగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. 2020 నిబంధనలలోని రూల్ 9(2) ప్రకారం ఈ దర్యాప్తు కొనసాగనుంది. గిరిబాలా సింగ్పై నమోదైన ఎఫ్ఐఆర్లో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని వరకట్న వేధింపులు, నేరపూరిత ఉద్దేశంతో కలసికట్టుగా వ్యవహరించడం వంటి సెక్షన్లు నమోదు చేశారు. అలాగే వరకట్న నిషేధ చట్టం కింద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పదవి నుంచి తొలగించారు. ఇక ఈ కేసులో బెయిల్ కూడా లభించింది.
Also Read
- SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
- CJP Parliament March: ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.. పార్లమెంట్ వరకు దూసుకెళ్లిన CJP కార్యకర్తలు..
- CJP Protest: ‘ఛలో పార్లమెంట్’ ఉద్యమంలో కీలక పరిణామం..
- Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
ఇదిలా ఉంటే నోయిడాకు చెందిన నటి ట్విషా శర్మ మే 15న భోపాల్లోని అత్తగారింట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. పెళ్లైన ఐదు నెలలకే ఆమె మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ట్విషా.. భోపాల్కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్ను 2024లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయం చేసుకుని.. 2025 డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత నుంచి వరకట్న వేధింపులకు గురిచేస్తున్నారని ట్విషా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు, పోస్ట్మార్టం ప్రక్రియపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ ఎయిమ్స్లో రెండో పోస్ట్మార్టం చేయాలన్న కుటుంబ సభ్యుల అభ్యర్థనను భోపాల్ కోర్టు బుధవారం తిరస్కరించింది.
ఇక ఈ కేసుపై స్పందించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్.. సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తామని తెలిపారు. మరోవైపు భోపాల్ పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ మాత్రం ఇప్పటివరకు దర్యాప్తులో హత్యకు ఆధారాలు లేవని.. ఆత్మహత్య కోణంలోనే కేసు ముందుకు సాగుతోందని వెల్లడించారు.
తాజావార్తలు
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Toxic: ‘టాక్సిక్’ నుంచి మరో సర్ప్రైజ్.. యష్తో ఈసారి తారా సుతారియా రొమాన్స్!
-
Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య!
-
CJP Parliament March: ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.. పార్లమెంట్ వరకు దూసుకెళ్లిన CJP కార్యకర్తలు..
-
Rohit Sharma 21 Records: ఒక్క సెంచరీ.. 21 రేర్ రికార్డ్స్.. లార్డ్స్లో రఫ్ఫాడించిన రోహిత్ శర్మ!
ట్రెండింగ్
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!