Turkish President Erdogan : ప్రపంచం మరో యుద్ధాన్ని ఎదుర్కొవాల్సి వస్తుంది.. టర్కీ అధ్యక్షుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turkish President Erdogan : ఇజ్రాయెల్పై టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ మరోసారి మండిపడ్డారు. ఇంటర్నేషనల్ బెనివలెన్స్ అవార్డ్స్ ఈవెంట్లో ఎర్డోగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడిందని తీవ్రంగా విమర్శించారు. గాజాలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా వేలాది మంది గాజన్లు కోల్పోవడం ఈ శతాబ్దపు అతిపెద్ద ఊచకోతగా ఆయన అభివర్ణించారు. గాజాలో ఇజ్రాయెల్ సృష్టిస్తున్న విధ్వంసాన్ని అడ్డుకోకపోతే ప్రపంచం మరో పెద్ద యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ఎర్డోగన్ ఇక్కడితో ఆగలేదు. ఇజ్రాయెల్కు ఆయుధాలు, సహాయం అందిస్తున్న దేశాలపై కూడా ఆయన మండిపడ్డారు. పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరిపై ఆయన మాట్లాడుతూ.. మానవ హక్కులపై ఇతర దేశాలకు ప్రసంగాలు ఇచ్చే దేశాలు ఇజ్రాయెల్కు సాయం చేస్తూ గాజాలో నరమేధాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. పాశ్చాత్య శక్తులు ఇజ్రాయెల్కు వెన్నుదన్నుగా నిలుస్తూ, ఇజ్రాయెల్ ఆక్రమణ విస్తరణను ఆపకపోతే, ఆ ప్రాంతంలో కొత్త వివాదం తలెత్తుతుందని టర్కీ అధ్యక్షుడు హెచ్చరించారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఓడిపోయిందని, మానవతావాదులు దీనిని ఖండిస్తున్నారని ఆయన అన్నారు.
Also Read
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
Read Also: Manushi Chhillar: బికినీలో మానుషి చిల్లర్ అందాలు చూడతరమా..
పాలస్తీనాను దేశంగా గుర్తించాలన్న ఐర్లాండ్, నార్వే, స్పెయిన్ నిర్ణయాలను అధ్యక్షుడు ఎర్డోగన్ స్వాగతించారు. ఇది కాకుండా, పాలస్తీనా వివాదాన్ని పరిష్కరించడానికి రెండు దేశాల ఒప్పందం ప్రకారం పాలస్తీనాను దేశంగా గుర్తించాలని ఆయన ఇతర దేశాలకు కూడా విజ్ఞప్తి చేశారు.
‘పాలస్తీనాలో శాంతికి రెండు దేశాల ఒప్పందమే పరిష్కారం’
మధ్యప్రాచ్యంలో శాంతికి 1967 సరిహద్దులపై రెండు దేశాల ఒప్పందమే ఏకైక పరిష్కారమని ఐర్లాండ్ ప్రభుత్వం బుధవారం పాలస్తీనాకు గుర్తింపు ప్రకటించింది. ‘మేము అరబ్ దేశాల శాంతి ప్రణాళికకు మద్దతు ఇస్తున్నాము. మే 28న పాలస్తీనాను అధికారికంగా గుర్తిస్తాము. దీని తరువాత పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించే మొత్తం దేశాల సంఖ్య సుమారు 147కి పెరిగింది. ఇది అఖండమైన ప్రపంచ ఏకాభిప్రాయాన్ని చూపుతుంది.’ అని పేర్కొన్నారు.
Read Also: AP CEO MK Meena: ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి..
తాజావార్తలు
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!