NTV Telugu Site icon

Tummala Nageswara Rao : నేను చేసిన అభివృద్ధిని మంత్రి పువ్వాడ తన ఖాతాలో వేసుకుంటున్నాడు

Tummala

Tummala

అల్లా కృప వల్ల భారతీయులు కలిసి ఉండాలన్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకులు తుమ్మల నాగేశ్వర రావు. ఇవాళ ఆయన ఖమ్మంలో ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ భారత్ జోడో మహా యాత్ర వల్ల మానవ జాతి ఏకం అయ్యిందన్నారు. ఐదు రాష్ట్రాల్లో మతతత్వ పార్టీలు ఒక వైపు ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీ మరో వైపున్నాయన్నారు. ఇందిర గాంధీ ని తూటాకు బలి చేసారన్నారు. రాజీవ్ గాంధీని ఉగ్ర వాదులు అంతం చేసారన్నారు. చిన్న పిల్లలను చంకలో వేసుకోని సోనియమ్మ దేశంలో అనేక మార్పులు తీసుకొచ్చిందన్నారు తుమ్మల. ప్రధాని అయ్యే అవకాశం వచ్చిన కాని రాహుల్ గాంధీ కుటుంబం త్యాగం చేసారన్నారు తుమ్మల నాగేశ్వర రావు.

Also Read : Israel: యుద్ధం తర్వాత గాజాను ఎవరు పాలిస్తారు.? ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఏమన్నారంటే..

అంతేకాకుండా.. ‘ఇందిర హయాంలో భారతదేశం సుభిక్షంగా ఉన్నట్లుగా .. సోనియమ్మ హాయాంలో తెలంగాణ సుభిక్షంగా ఉండబోతుంది. నేను చేసిన అభివృద్ధిని మంత్రి పువ్వాడ తన ఖాతాలో వేసుకుంటున్నాడు. కాకతీయుల ఖిల్లాను కూడా అజయ్ కట్టించానని చెప్పుకుంటే అతిశయోక్తి లేదు. బస్టాండు కట్టమంటే దానికి రేకులు వేసి చిల్లులు వేసిన మంత్రి పువ్వాడ. నేను 40 ఏళ్ల క్రితం కట్టినది ఏది కూడా కూలలేదు. ఖిల్లా చుట్టు తిరిగి జిల్లా గురించి మాట్లాడుతాడు మంత్రి అజయ్. ఖమ్మం జిల్లా రూప శిల్పి తుమ్మల నాగేశ్వరరావు. అభివృధ్దికి అడ్డం పడే వ్యక్తి అజయ్. ముస్లిం సోదరులకు ఖమ్మం లో రాజకీయ భవిష్యత్తు కల్పిస్తా. ఖమ్మం లో రాజకీయంగా ముస్లింలకు మంచి స్థానాలు కల్పిస్తా. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ని ఖమ్మం కు ప్రాముఖ్యత కల్పిస్తా.’ అని తుమ్మల నాగేశ్వర రావు వ్యాఖ్యానించారు.

Also Read : Israel-Hamas War: ఇజ్రాయిల్ ఆర్మీని ‘ఉగ్ర సంస్థ’గా గుర్తించాలి.. ముస్లిం దేశాలకు ఇరాన్ పిలుపు..