TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
- అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు
- తిరుమలలో 51 ప్రాంతాలకు ఆధ్యాత్మిక పేర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల సౌకర్యాలు, ఆలయాల అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం లక్ష్యంగా పలు అంశాలపై ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు తిరుమలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ప్రభావం చూపనున్నాయి. తిరుమలలోని వరహస్వామి గెస్ట్ హౌస్-1 అభివృద్ధి పనుల కోసం రూ.3.6 కోట్ల నిధులు కేటాయించారు. అలాగే తిరుమలలో పరిపాలన భవనం నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అలిపిరి వద్ద బస్సుల తనిఖీ కోసం రూ.4.5 కోట్లతో షెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
సాంస్కృతిక రంగంలో భాగంగా ప్రముఖ కళాకారిణి శోభరాజ్ను టీటీడీ ఆస్థాన విద్వాంసురాలిగా నియమించారు. ఇక సత్యసాయి జిల్లా లేపాక్షిలో కళ్యాణ మండపం నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది. టీటీడీ ఉద్యోగుల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు దర్శనం, లడ్డు కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. అలాగే ఉద్యోగుల హెల్త్ స్కీం రీయింబర్స్మెంట్ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. ఉద్యోగుల ఇంటి స్థలాల అభివృద్ధి పనులపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు.
Also Read
- పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
- Sreesanth Challenges Harbhajan: "దమ్ముంటే రింగ్లోకి రా.!" హర్భజన్ సింగ్కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
- Akshara Gupta: దేశీయ క్రికెట్లో విధ్వంసం.. 126 బంతుల్లోనే 306 పరుగులు.. వైభవ్ సూర్యవంశీ కంటే డేంజర్గా ఉందే.!
- Mojtaba Khamenei: "ఆయన హామీతోనే ఓకే చెప్పా".. అమెరికా-ఇరాన్ డీల్పై సుప్రీంలీడర్ షాకింగ్ కామెంట్స్..
ఆలయాలకు ధూప, దీప, నైవేద్యం కోసం ఇచ్చే నిధులను రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పెంచుతూ టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని పెంచేందుకు తిరుమలలో 51 ప్రాంతాలకు ఆధ్యాత్మిక పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ఇక వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని మే 1 నుంచి జూలై 15 వరకు సిఫార్సు లేఖలను స్వీకరించకూడదని టీటీడీ నిర్ణయించింది. అదనంగా ఖమ్మంలో 20 ఎకరాల్లో టీటీడీ ఆలయ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఆలయ నిర్మాణానికి ఇచ్చిన 20 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు.
తాజావార్తలు
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!
-
Oppo Reno 15A 5G: ఒప్పో రెనో 15A 5G రిలీజ్.. 7,000mAh బ్యాటరీ, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50MP సెల్ఫీ కెమెరా
-
Vivo Y6e 5G: Snapdragon 4 Gen 2 చిప్సెట్, 6,500mAh బ్యాటరీతో.. వివో Y6e 5G స్మార్ట్ఫోన్ విడుదల
-
Sreesanth Challenges Harbhajan: “దమ్ముంటే రింగ్లోకి రా.!” హర్భజన్ సింగ్కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..