TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
- అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు
- తిరుమలలో 51 ప్రాంతాలకు ఆధ్యాత్మిక పేర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల సౌకర్యాలు, ఆలయాల అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం లక్ష్యంగా పలు అంశాలపై ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు తిరుమలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ప్రభావం చూపనున్నాయి. తిరుమలలోని వరహస్వామి గెస్ట్ హౌస్-1 అభివృద్ధి పనుల కోసం రూ.3.6 కోట్ల నిధులు కేటాయించారు. అలాగే తిరుమలలో పరిపాలన భవనం నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అలిపిరి వద్ద బస్సుల తనిఖీ కోసం రూ.4.5 కోట్లతో షెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
సాంస్కృతిక రంగంలో భాగంగా ప్రముఖ కళాకారిణి శోభరాజ్ను టీటీడీ ఆస్థాన విద్వాంసురాలిగా నియమించారు. ఇక సత్యసాయి జిల్లా లేపాక్షిలో కళ్యాణ మండపం నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది. టీటీడీ ఉద్యోగుల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు దర్శనం, లడ్డు కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. అలాగే ఉద్యోగుల హెల్త్ స్కీం రీయింబర్స్మెంట్ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. ఉద్యోగుల ఇంటి స్థలాల అభివృద్ధి పనులపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఆలయాలకు ధూప, దీప, నైవేద్యం కోసం ఇచ్చే నిధులను రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పెంచుతూ టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని పెంచేందుకు తిరుమలలో 51 ప్రాంతాలకు ఆధ్యాత్మిక పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ఇక వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని మే 1 నుంచి జూలై 15 వరకు సిఫార్సు లేఖలను స్వీకరించకూడదని టీటీడీ నిర్ణయించింది. అదనంగా ఖమ్మంలో 20 ఎకరాల్లో టీటీడీ ఆలయ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఆలయ నిర్మాణానికి ఇచ్చిన 20 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!