TSRTC: టీ-9 టికెట్ తెచ్చిన ఆర్టీసీ.. ఇప్పటి నుంచి ఆ బస్సులో కూడా వర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రామీణ, పట్టణ ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ‘టీ-9 టికెట్’ సమయాల్లో TSRTC మార్పులు చేసింది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తొలిసారిగా ఈ టికెట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని తెలిపింది. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఈ టికెట్ చెల్లుబాటు అయ్యేది. అయితే.. ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ టికెట్ను సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది.
Read Also: Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. మనీష్ సిసోడియా, ఇతరుల ఆస్తులు స్వాధీనం
Also Read
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
- Amen : "గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు".. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
టీ-9 టికెట్తో ఎక్స్ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కల్పించింది. రూ.100 చెల్లించి ఈ టికెట్ను కొనుగోలు చేసిన ప్రయాణికులు.. తిరుగు ప్రయాణంలో రూ.20 కాంబీనేషన్ టికెట్తో ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ జర్నీ చేసే వెసులుబాటు కల్పించింది. తిరుగుప్రయాణంలో మాత్రమే ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ.20 కాంబీ టికెట్ వర్తిస్తుందని ప్రకటించింది. టీ-9 టికెట్ సవరణ సమయాలు, రూ.20 కాంబి టికెట్ ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్టీసీ వెల్లడించింది.
Read Also: Baby Trailer: అబ్బాయిలను గుండెల మీద కొట్టాలంటే.. అమ్మాయిల కంటే గట్టిగా ఎవ్వరు కొట్టలేరు
పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్స్ కోసం టీ-9 టికెట్ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఈ టీకెట్ ద్వారా రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో ఒక్కసారి రానూపోను ప్రయాణం చెయొచ్చని తెలిపింది. జూన్ 18న అందుబాటులోకి తెచ్చిన ఈ టికెట్కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే 11 వేల మంది ప్రయాణికులు ఈ టికెట్ను కొనుగోలు చేశారు. టీ-9 టికెట్ సమయాలను సవరించాలని సంస్థ దృష్టికి కొందరు ప్రయాణికులు తీసుకు రావడంతో వారి అభ్యర్థలను పరిశీలించిన తర్వాత ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమయాన్ని టీఎస్ఆర్టీసీ పెంచింది.
Read Also: Ratan Tata: వానాకాలంలో డ్రైవింగ్ చేసేవారు జర దీని గురించి తెలుసుకోండి..
అయితే.. తిరుగు ప్రయాణంలో ఎక్స్ప్రెస్ సర్వీసుల్లోప్రయాణించేందుకు గాను కొత్తగా రూ.20తో కాంబీనెషన్ టికెట్ను అందుబాటులోకి తీసుకురావడంతో ఈ టికెట్ ద్వారా ఒక్కొక్కరికీ రూ.20 నుంచి రూ.40 ఆదా అవుతుంది. ఈ టికెట్ను మహిళలు, సీనియర్ సిటిజన్స్ కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలి అని టీఎస్ఆర్టీసీ తెలిపింది. సంస్థను ఆదరించాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే టీ-24, టీ-6, ఎఫ్-24 టికెట్లను టీఎస్ఆర్టీసీ ఇప్పటికే అందిస్తోండగా.. తొలిసారిగా గ్రామీణ, పట్టణ ప్రయాణికుల సౌకర్యార్థం టీ-9 టికెట్ ను ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తెచ్చిందని వారు వెల్లడించారు.
తాజావార్తలు
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
-
Amen : “గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు”.. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!