Telangana Elections: తెలంగాణలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. డబ్బులిస్తే కానీ ఓట్లేయమని ఓటర్లు నాయకులను డిమాండ్ చేస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బయ్యారం మండలం సంతులాల్ పోడు గ్రామపంచాయతీ పరిధిలోని సంతులాల్ పోడు ఎస్సీ కాలనీ ఓటర్లు ‘డబ్బులు ఇస్తేనే.. ఓటు వేస్తాం’ అంటూ తేల్చి చెప్పేశారు ఓటర్లు. దీంతో ఓటేయాలంటూ అధికారులు బతిమాలుతున్నారు. ఇప్పటి వరకు అక్కడ ఒక్క ఓటు కూడా పోల్ కాలేదు.
Read Also:Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. 11 గంటల వరకు పోలింగ్ శాతం 20.64!
ఓటర్లు లేక వెలవెల
తమ గ్రామాన్ని గ్రామపంచాయతీగా మార్చకపోవడంతో మనస్థాపం చెంది.. అందుకు నిరసనగా బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండలం వరిపేట గ్రామానికి చెందిన ఓటర్లు పోలింగ్ను బహిష్కరించారు. ఉదయం 11గంటల వరకూ ఆ గ్రామంలో కేవలం 20 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి గ్రామస్తులతో చర్చలు జరుపుతున్నారు.
Read Also:MGBS : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు.. ప్రయాణికులతో కిక్కిరిసిన ఎంజీబీఎస్
