Donald Trump: ఇరాన్కు హై లెవల్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. ఇక వినాశనమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వానికి జారీ చేసిన హెచ్చరికలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఇరాన్లో కొత్తగా ఏర్పడిన అధికార యంత్రాంగంతో సైనిక కార్యకలాపాలను ముగించే విషయమై అమెరికా కీలక చర్చలు జరుపుతోందని ఆయన వెల్లడించారు. ఈ చర్చలు సానుకూల ధోరణిలో సాగుతున్నాయని చెబుతూనే.. ఒకవేళ తక్కువ సమయంలోనే సరైన ఒప్పందం కుదరకపోతే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ని తక్షణమే వాణిజ్య కార్యకలాపాల కోసం పూర్తిగా తెరవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఒకవేళ ఈ నిబంధనలకు ఇరాన్ లొంగకపోతే.. అమెరికా తన సైనిక శక్తిని ఉపయోగించి ఆ దేశ ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతుందని హెచ్చరించారు. ఇరాన్ అంతటా విస్తరించి ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ప్రధాన చమురు బావులు, వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ‘ఖార్గ్ ద్వీపాన్ని’ పూర్తిగా తుడిచిపెట్టేస్తామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే సముద్రపు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లను కూడా ధ్వంసం చేయడానికి వెనుకాడబోమని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటివరకు అమెరికా ఈ ప్రాంతాలను ముట్టుకోలేదని, కానీ సహనం నశిస్తే ఇవి తమ తదుపరి లక్ష్యాలు అవుతాయని ఆయన ఘాటుగా స్పందించారు.
Also Read
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
- DK Shivakumar: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం.. ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
- Supreme Court: వేధించడానికే పెళ్లిళ్లు చేసుకుంటారా? అబ్బాయిలకు సుప్రీంకోర్టు చీవాట్లు
- Rishab Pant: అనుకున్నదే జరిగింది.. LSG కెప్టెన్సీ నుంచి రిషభ్ పంత్ ఔట్..
Also Read:Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?
గత 47 ఏళ్లుగా ఇరాన్ పాత ప్రభుత్వం సాగించిన ‘హింసా పాలన’ లో ప్రాణాలు కోల్పోయిన అమెరికా సైనికులకు, ఇతర పౌరులకు ఇది ప్రతీకారమని ట్రంప్ అభివర్ణించారు. ఈ హెచ్చరికలతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల ప్రభావం అంతర్జాతీయంగా చమురు ధరలపై , ప్రపంచ స్టాక్ మార్కెట్లపై పడే అవకాశం ఉంది. భారత్ వంటి దేశాలు తమ చమురు దిగుమతుల కోసం ఈ ప్రాంతంపైనే ఆధారపడటంతో, అక్కడ నెలకొన్న ఉద్రిక్తతలు మన ఆర్థిక వ్యవస్థపై కూడా ఒత్తిడి పెంచుతాయి. చర్చల ద్వారా శాంతి నెలకొంటుందా లేక ట్రంప్ అన్నట్లుగా భారీ వినాశనం సంభవిస్తుందా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ రేపుతోంది.
తాజావార్తలు
-
Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
-
DK Shivakumar: ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంపై సందిగ్ధం.. ఢిల్లీలో డీకే.శివకుమార్ కీలక వ్యాఖ్యలు
-
Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
-
Chivas Regal, Absolut Vodka Ban: మందుబాబులకు షాక్.. అబ్సోలట్ వోడ్కా, చివాస్ రీగల్ అమ్మకాలపై నిషేధం..!
-
Rishabh Pant: రూ.27 కోట్ల పంత్ ఫెయిల్.. LSG కెప్టెన్సీకి గుడ్బై
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!