Iran: హర్మూజ్ జలసంధి నుంచి నౌకలు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇరాన్.. కానీ..
- నౌకలు వెళ్లేందుకు అనుమతిచ్చిన ఇరాన్..
- శత్రుదేశాల నౌకలకు అనుమతి నిరాకరణ..
- ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ సమాధానం ఇదే..
ప్రపంచ దేశాలకు ముడి చమురు సరఫరా చేసే అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద పరిస్థితి ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఇరాన్ మధ్య మాటల యుద్ధం ముదిరిపోవడంతో.. ఇది ఎటు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు భయాందోళన చెందుతున్నాయి.
ట్రంప్ ఏం హెచ్చరించారు?
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ఇరాన్కు ఒక గట్టి హెచ్చరిక జారీ చేశారు. ‘వచ్చే 48 గంటల్లోగా హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచి ఉంచకపోతే, ఇరాన్లోని అతిపెద్ద విద్యుత్ కేంద్రాలను అమెరికా నేలమట్టం చేస్తుంది’ అని ఆయన హెచ్చరించారు. కేవలం హెచ్చరించడమే కాకుండా.. మొట్టమొదట ఇరాన్లోని అన్నింటికంటే పెద్దదైన పవర్ ప్లాంట్పైనే దాడి చేస్తామని బాంబు పేల్చారు. ఇరాన్ తీరు వల్ల అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకం కలుగుతోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:CM Revanth Reddy : మహిళా సంఘాలకు బంపర్ ఆఫర్.. ఇకపై అందరూ కోటీశ్వరులే.!
ఇరాన్ సమాధానం ఏమిటి..?
ట్రంప్ హెచ్చరికలపై ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్ ప్రతినిధి అలీ మూసవి స్పందించారు. హర్మూజ్ జలసంధి అందరికీ తెరిచే ఉందని, అయితే తమ శత్రువులకు సంబంధించిన నౌకలను మాత్రం అనుమతించబోమని ఆయన తేల్చి చెప్పారు. ఇరాన్తో భద్రతాపరమైన ఒప్పందాలు చేసుకుని.. తమకు సహకరించే దేశాల నౌకలు యథావిధిగా ప్రయాణించవచ్చని తెలిపారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఉద్రిక్తతలకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే కారణమని ఆయన విమర్శించారు. దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకోవడమే తమ మొదటి ప్రాధాన్యత అని, కానీ దాడులు ఆగిపోయి పరస్పర నమ్మకం ఏర్పడటం అంతకంటే ముఖ్యమని ఇరాన్ వ్యాఖ్యానించింది.
ఎందుకింత రచ్చ..?
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20 శాతం ఈ హర్మూజ్ జలసంధి ద్వారానే వెళ్తుంది. ఇది గనుక మూతపడితే పెట్రోల్, గ్యాస్ ధరలు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతాయి. అందుకే అమెరికా ఈ మార్గంపై పట్టు కోసం ప్రయత్నిస్తుండగా.. ఇరాన్ తన భూభాగం గుండా వెళ్లే ఈ మార్గాన్ని ఆయుధంగా వాడుకుంటోంది. ప్రస్తుతం ఈ 48 గంటల గడువు సమీపిస్తుండటంతో, ప్రపంచమంతా అప్రమత్తమైంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!