Banana Farming: స్విట్జర్లాండ్లో ఉద్యోగం వదిలేశాడు.. అరటి సాగుతో రూ.100కోట్లు సంపాదించాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Banana Farming: అరటిపండు తినడానికి దాదాపు అందరూ ఇష్టపడతారు. విటమిన్ సి, డైటరీ ఫైబర్, విటమిన్ B6, మాంగనీస్తో సహా అనేక రకాల పోషకాలు అరటిపండులో ఉంటాయి. ఇది దాదాపు భారతదేశం అంతటా సాగు చేయబడుతుంది. అరటి సాగు చేసి లక్షాధికారులుగా మారిన ఇలాంటి రైతులు దేశంలో ఎందరో ఉన్నారు. అయితే విదేశాల్లో మంచి ఉద్యోగం వదిలేసి ఇండియాకి వచ్చి అరటి సాగు ప్రారంభించి అనతికాలంలోనే కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని నెలకొల్పిన అలాంటి వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అతను విదేశాలకు కూడా అరటి పండ్లను సాగు చేస్తున్నాడు.
Read Also:RK Selvamani: మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణిపై అరెస్ట్ వారెంట్..
Also Read
- Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
- Vaibhav Sooryavanshi: వైభవ్తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
- Sugar Free Diet: చక్కెర పూర్తిగా మానేస్తే ఆరోగ్యానికే ప్రమాదమా..? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు
- Pak ISI: తప్పిన పెను ప్రమాదం.. పాకిస్తాన్ ISI ఉగ్రవాద ముఠాను పట్టుకున్న పోలీసులు..
ఈ రైతు పేరు అలోక్ అగర్వాల్. అతను ముంబై నివాసి. గతంలో అలోక్ స్విట్జర్లాండ్లోని బనానా ఎక్స్పోర్ట్లో లాజిస్టిక్స్ పని చేసేవాడు. ఇక్కడ అతను అరటిపండ్ల ఎగుమతి-దిగుమతుల గురించి పూర్తి సమాచారాన్ని సంపాదించాడు. ఆ తర్వాత ఉద్యోగం వదిలేసి ఇండియా వచ్చి అరటిపండు వ్యాపారం మొదలుపెట్టాడు. 2015లో ట్రైడెంట్ ఆగ్రో పేరుతో కంపెనీని ప్రారంభించాడు. ఆ తర్వాత ఈ కంపెనీ ద్వారా భారత్కు అరటిపండ్లను ఎగుమతి చేయడం ప్రారంభించాడు. విశేషమేమిటంటే ఈ కంపెనీ కూడా కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా అరటి సాగు చేస్తోంది. అలోక్ అగర్వాల్ అరటిపండ్లను ఎగుమతి చేయడమే కాకుండా చిప్స్, స్నాక్స్లను కూడా తయారు చేస్తున్నాడు. దీనితో పాటు ఇతర అరటి ఉత్పత్తులను కూడా తయారు చేస్తారు. ప్రస్తుతం అతని కంపెనీ ఏటా రూ. 100 కోట్ల టర్నోవర్ను కలిగి ఉంది.
విశేషమేమిటంటే.. కంపెనీని ప్రారంభించిన తర్వాత అలోక్ అగర్వాల్ పూణే జిల్లా రైతులకు అరటి పండించేలా శిక్షణ ఇవ్వడంతో అరటిపంటల ఉత్పత్తి పెరిగింది. దీంతో పాటు నాణ్యమైన అరటిని ఎలా పండించాలో, వాటిని ఎక్కువ కాలం సురక్షితంగా ఉండేలా వాటిని ఎలా నిల్వ చేసుకోవాలో రైతులకు వివరించారు. తొలిసారిగా పండ్ల సంరక్షణ ప్రాధాన్యతను రైతులకు వివరించారు. రైతుల కష్టార్జితం సంకల్ప బలంతో రూ.100 కోట్లతో అలోక్ కంపెనీని నెలకొల్పడానికి కారణం ఇదే.
తాజావార్తలు
-
Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
-
Vaibhav Sooryavanshi: వైభవ్తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
-
Jaypee Associates: సున్నాకి పడిపోయిన ఆ కంపెనీ షేర్ వాల్యూ.. రోడ్డున పడిన 6 లక్షల మంది ఇన్వెస్టర్లు!
-
Sugar Free Diet: చక్కెర పూర్తిగా మానేస్తే ఆరోగ్యానికే ప్రమాదమా..? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు
-
Pak ISI: తప్పిన పెను ప్రమాదం.. పాకిస్తాన్ ISI ఉగ్రవాద ముఠాను పట్టుకున్న పోలీసులు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?