Hyderabad: ఠాగూర్ సీన్ రిపీట్.. డెడ్ బాడీకి ట్రీట్మెంట్
- ఠాగూర్ సినిమాలో ప్రాణం పోయిన వ్యక్తికి ట్రీట్మెంట్
- తాజాగా హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో అలాంటి సీన్
- నెల రోజుల నుండి ట్రీట్మెంట్ చేస్తున్నామని లక్షల్లో డబ్బులు కాజేత
- చివరకు వేరే ఆస్పత్రిలో జాయిన్ చేసుకోమ్మని చెప్పిన యాజమాన్యం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైద్యాన్ని వ్యాపారంగా చేసుకుని డబ్బులు దండుకుంటున్నారు కొందరు డాక్టర్లు.. ఆసుపత్రిలో చేరే పేషెంట్ల ఆర్ధిక స్థితిని బట్టి.. వాళ్ల అమాయకత్వాన్ని ఆధారంగా చేసుకొని డబ్బులు లాగేస్తున్న ఘటనలు నిత్యం ఏదో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ సినిమాలోని ఆసుపత్రి సీన్ గుర్తుందా? అప్పట్లో అది పెను సంచలనమే అయ్యింది. వ్యక్తి చనిపోయినా అతడు బ్రతికే ఉన్నాడంటూ అబద్ధం చెప్పి.. వైద్యం పేరుతో లక్షలకు లక్షలు ప్రైవేటు ఆసుపత్రులు కాజేస్తుంటాయని ఆ సినిమాలో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఆ సినిమాలో చూపించినట్టుగానే.. రియల్ లైఫ్లోనూ కొన్ని సంఘటనలు జరిగాయి. తాజాగా.. అలాంటి ఘటన హైదరాబాద్లో జరిగింది.
Read Also: Tamilnadu : తమిళనాడులో వీధి కుక్కల బారీన పడిన 14వేల మంది
Also Read
- Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
- Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
వివరాల్లోకి వెళ్తే.. ఓ అమ్మాయిని చికిత్స కోసం తీసుకురాగా, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ యువతి చనిపోయింది. ఈ ఘటన మియాపూర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది. సుహాసిని (26) అనే యువతికి కళ్ళు తిరిగి పడిపోతే కడప హాస్పిటల్ నుండి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు బంధువులు. కానీ నెల రోజుల నుండి పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తున్నామని నమ్మబలికి 12 లక్షల 50 వేలు బిల్ కట్టించుకున్నారు.
Read Also: Gang Rape: హైదర్షాకోట్ గ్యాంగ్ రేప్లో సంచలన విషయాలు..
ఇంక బ్యాలెన్స్ రూ.5 లక్షలు బిల్ కట్టండని, పాప బతుకుతుంది అని నమ్మబలికారు.. కానీ ఈరోజు ఉదయం బిల్ కట్టనక్కర్లేదు అని.. నిమ్స్ ఆస్పత్రిలో జాయిన్ చేస్కోండి అని హాస్పిటల్ యాజమాన్యం చెప్పింది. దీంతో.. బాలిక పేరెంట్స్ నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఎమర్జెన్సీ వార్డులో పరిశీలించిన వైద్యులు యువతి చనిపోయిందని చెప్పారు. దీంతో యువతి మృతదేహాన్ని తిరిగి సిద్ధార్థ్ న్యూరో ఆస్పత్రికి తీసుకొచ్చిన బంధువుల తమకు న్యాయం చేయాలని ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మూడు, నాలుగు రోజుల క్రితమే చనిపోయినా తమకు ఇప్పటి వరకు సమాచారం అందించలేదని.. సిద్ధార్థ హాస్పిటల్ పైన తగిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!