Hyderabad: ఠాగూర్ సీన్ రిపీట్.. డెడ్ బాడీకి ట్రీట్మెంట్
- ఠాగూర్ సినిమాలో ప్రాణం పోయిన వ్యక్తికి ట్రీట్మెంట్
- తాజాగా హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో అలాంటి సీన్
- నెల రోజుల నుండి ట్రీట్మెంట్ చేస్తున్నామని లక్షల్లో డబ్బులు కాజేత
- చివరకు వేరే ఆస్పత్రిలో జాయిన్ చేసుకోమ్మని చెప్పిన యాజమాన్యం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైద్యాన్ని వ్యాపారంగా చేసుకుని డబ్బులు దండుకుంటున్నారు కొందరు డాక్టర్లు.. ఆసుపత్రిలో చేరే పేషెంట్ల ఆర్ధిక స్థితిని బట్టి.. వాళ్ల అమాయకత్వాన్ని ఆధారంగా చేసుకొని డబ్బులు లాగేస్తున్న ఘటనలు నిత్యం ఏదో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ సినిమాలోని ఆసుపత్రి సీన్ గుర్తుందా? అప్పట్లో అది పెను సంచలనమే అయ్యింది. వ్యక్తి చనిపోయినా అతడు బ్రతికే ఉన్నాడంటూ అబద్ధం చెప్పి.. వైద్యం పేరుతో లక్షలకు లక్షలు ప్రైవేటు ఆసుపత్రులు కాజేస్తుంటాయని ఆ సినిమాలో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఆ సినిమాలో చూపించినట్టుగానే.. రియల్ లైఫ్లోనూ కొన్ని సంఘటనలు జరిగాయి. తాజాగా.. అలాంటి ఘటన హైదరాబాద్లో జరిగింది.
Read Also: Tamilnadu : తమిళనాడులో వీధి కుక్కల బారీన పడిన 14వేల మంది
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
వివరాల్లోకి వెళ్తే.. ఓ అమ్మాయిని చికిత్స కోసం తీసుకురాగా, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ యువతి చనిపోయింది. ఈ ఘటన మియాపూర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది. సుహాసిని (26) అనే యువతికి కళ్ళు తిరిగి పడిపోతే కడప హాస్పిటల్ నుండి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు బంధువులు. కానీ నెల రోజుల నుండి పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తున్నామని నమ్మబలికి 12 లక్షల 50 వేలు బిల్ కట్టించుకున్నారు.
Read Also: Gang Rape: హైదర్షాకోట్ గ్యాంగ్ రేప్లో సంచలన విషయాలు..
ఇంక బ్యాలెన్స్ రూ.5 లక్షలు బిల్ కట్టండని, పాప బతుకుతుంది అని నమ్మబలికారు.. కానీ ఈరోజు ఉదయం బిల్ కట్టనక్కర్లేదు అని.. నిమ్స్ ఆస్పత్రిలో జాయిన్ చేస్కోండి అని హాస్పిటల్ యాజమాన్యం చెప్పింది. దీంతో.. బాలిక పేరెంట్స్ నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఎమర్జెన్సీ వార్డులో పరిశీలించిన వైద్యులు యువతి చనిపోయిందని చెప్పారు. దీంతో యువతి మృతదేహాన్ని తిరిగి సిద్ధార్థ్ న్యూరో ఆస్పత్రికి తీసుకొచ్చిన బంధువుల తమకు న్యాయం చేయాలని ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మూడు, నాలుగు రోజుల క్రితమే చనిపోయినా తమకు ఇప్పటి వరకు సమాచారం అందించలేదని.. సిద్ధార్థ హాస్పిటల్ పైన తగిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..