Revanth Reddy: CEC స్వతంత్రంగా ఉందా… కేంద్రం గుప్పిట్లో ఉందా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కమిటీల లొల్లి నడుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీపై తీవ్రవిమర్శలు చేస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. బంగారు కూలీ కేసు విచారణలో ఉండగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చుతూ సీఈసీ నోటిఫికేషన్ ఇవ్వడం చట్ట విరుద్ధం. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సీఈసీ స్వతంత్రంగా ఉందా… కేంద్రం గుప్పిట్లో ఉందా!? అనే అనుమానం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.
టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తూ ఎన్నికల కమిషన్ ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ బంగారు కూలీకి వచ్చిన నిధులపై రేవంత్ ఫిర్యాదుచేశారు. దీనిపై విచారణ జరపాలని ఆదాయపన్ను శాఖకు లేఖ పంపింది ఎన్నికల సంఘం. దీనిపై విచారణ పూర్తికాకముందే బీఆర్ఎస్ గా గుర్తించడం ఏంటని అంటున్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ మీద రేవంత్ రె్డి వేసిన పిటిషన్ మీద ఢిల్లీ హైకోర్ట్ విచారణ జరిపింది. అభ్యంతరాలు ఉన్న శాఖలపై ప్రత్యేకంగా పిటిషన్లు వేసుకోవాలని ఢిల్లీ హైకోర్ట్ సూచించింది. కేసు విచారణను ముగించిన హైకోర్ట్.. మరో పిటిషన్ వేసుకునే అవకాశం ఇచ్చింది.
Also Read
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
- Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తిస్తూ ఈసీ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈసందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ఎస్ గా గుర్తిస్తున్నట్లు లేఖ పంపింది. పార్టీ పేరు మార్పు కోరుతూ అక్టోబర్ 5న టీఆర్ఎస్ పార్టీ దరఖాస్తు చేసుకుంది. డిసెంబర్ 9 శుక్రవారం మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు మంచి ముహూర్త సమయాన “భారత రాష్ట్ర సమితి” ఆవిర్భావం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పార్టీ నూతన జెండాను కేసీఆర్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీలోనూ పార్టీ తాత్కాలిక కార్యాలయం ప్రారంభం అయింది.
బంగారు కూలీ కేసు విచారణలో ఉండగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చుతూ సీఈసీ నోటిఫికేషన్ ఇవ్వడం చట్ట విరుద్ధం.
దీనిపై కాంగ్రెస్ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
సీఈసీ స్వతంత్రంగా ఉందా… కేంద్రం గుప్పిట్లో ఉందా!? pic.twitter.com/Qx1lo0oZI7
— Revanth Reddy (@revanth_anumula) December 19, 2022
తాజావార్తలు
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!