Revanth Reddy: CEC స్వతంత్రంగా ఉందా… కేంద్రం గుప్పిట్లో ఉందా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కమిటీల లొల్లి నడుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీపై తీవ్రవిమర్శలు చేస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. బంగారు కూలీ కేసు విచారణలో ఉండగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చుతూ సీఈసీ నోటిఫికేషన్ ఇవ్వడం చట్ట విరుద్ధం. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సీఈసీ స్వతంత్రంగా ఉందా… కేంద్రం గుప్పిట్లో ఉందా!? అనే అనుమానం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.
టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తూ ఎన్నికల కమిషన్ ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ బంగారు కూలీకి వచ్చిన నిధులపై రేవంత్ ఫిర్యాదుచేశారు. దీనిపై విచారణ జరపాలని ఆదాయపన్ను శాఖకు లేఖ పంపింది ఎన్నికల సంఘం. దీనిపై విచారణ పూర్తికాకముందే బీఆర్ఎస్ గా గుర్తించడం ఏంటని అంటున్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ మీద రేవంత్ రె్డి వేసిన పిటిషన్ మీద ఢిల్లీ హైకోర్ట్ విచారణ జరిపింది. అభ్యంతరాలు ఉన్న శాఖలపై ప్రత్యేకంగా పిటిషన్లు వేసుకోవాలని ఢిల్లీ హైకోర్ట్ సూచించింది. కేసు విచారణను ముగించిన హైకోర్ట్.. మరో పిటిషన్ వేసుకునే అవకాశం ఇచ్చింది.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తిస్తూ ఈసీ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈసందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ఎస్ గా గుర్తిస్తున్నట్లు లేఖ పంపింది. పార్టీ పేరు మార్పు కోరుతూ అక్టోబర్ 5న టీఆర్ఎస్ పార్టీ దరఖాస్తు చేసుకుంది. డిసెంబర్ 9 శుక్రవారం మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు మంచి ముహూర్త సమయాన “భారత రాష్ట్ర సమితి” ఆవిర్భావం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పార్టీ నూతన జెండాను కేసీఆర్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీలోనూ పార్టీ తాత్కాలిక కార్యాలయం ప్రారంభం అయింది.
బంగారు కూలీ కేసు విచారణలో ఉండగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చుతూ సీఈసీ నోటిఫికేషన్ ఇవ్వడం చట్ట విరుద్ధం.
దీనిపై కాంగ్రెస్ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
సీఈసీ స్వతంత్రంగా ఉందా… కేంద్రం గుప్పిట్లో ఉందా!? pic.twitter.com/Qx1lo0oZI7
— Revanth Reddy (@revanth_anumula) December 19, 2022
తాజావార్తలు
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Ramayana: ‘రామాయణ’లో..సాయి పల్లవిపై మేకర్స్ కీలక నిర్ణయం!
-
Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్తలు!
-
Pat Cummins: “ఏం పర్వాలేదు.. ప్లేఆఫ్స్కు ఇంకా ఛాన్స్ ఉందిగా”.. కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!