TPCC Cheif Mahesh Goud : కార్యకర్తలు, నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాదాపూర్లోని ట్రైడెంట్ హోట్ల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత్తన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్ష పదవిని ఒక బాధ్యతగా భావిస్తా అని, పార్టీని ముందుకు నడపడంలో సమిష్టి బాధ్యత అవసరమని నేను నమ్ముతున్నా అని ఆయన అన్నారు. కార్యకర్తలు, నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటా అని ఆయన వెల్లడించారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటానని ఆయన తెలిపారు. కార్యకర్తలు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలని ఆయన తెలిపారు. జిల్లా ఇంచార్జ్ మంత్రులపై ఎక్కువ బాధ్యత ఉందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. స్థానిక సంస్థల్లో 90 శాతం స్థానాలను గెలవాలని ఆయన అన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అందిస్తోందని, కార్యకర్తలను సమాయత్తం చేసి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యమన్నారు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
Gaza War: గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. ఏడుగురు మృతి
Also Read
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
అంతేకాకుండా..’నేను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో మమేకమై పనిచేశాం.. అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేద్దాం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలను పార్టీ, ప్రజాప్రతినిధులు జనంలోకి తీసుకెళ్లాలి… కేసీఆర్ అబద్దాలతో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించారు.. కేసీఆర్ పదేళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేసి పోయాడు..రాహుల్ గాంధీ ఈ దేశానికి ఆశాకిరణం… రాహుల్ ను ప్రధాని చేయడమే ధ్యేయంగా అంతా పనిచేయాలి.. ప్రధాని మోదీకి భవిష్యత్తు లేదు.. కులం,మతం పేరుతో యువతను తప్పుదారి పట్టిస్తున్నారు.. వారిని చైతన్యపరచాలి.. రాహుల్ గాంధీతో చేయి కలిపి ముందుకు సాగాలి… ఎస్సీ,ఎస్టీ, బీసీ లు, మైనార్టీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు… తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ ఆశీస్సులు ఎప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ కు ఉంటాయి… కార్యకర్తల కష్ట సుఖాలు తెలుసుకొని ముందుకు వెళ్తా… రెండోసారీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది…’ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
Viral Wedding Card: ఐడియా అదుర్స్ గురూ.. “ఆపిల్ మ్యాక్ బుక్ పెళ్లి పత్రిక”.. వీడియో వైరల్
తాజావార్తలు
-
Oscars Academy :’RRR’ ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!