Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 9am 15 08 2023

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Published Date :August 15, 2023 , 9:00 am
By Gogikar Sai Krishna
Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

2023లో అద్భుతాలు చేసిన ఫార్మా స్టాక్స్.. ఇన్వెస్టర్లకు 120శాతం లాభాలు

కరోనా మహమ్మారి తర్వాత మందులు, వ్యాక్సిన్‌లు, ఆరోగ్యం గురించి ప్రజల్లో పెరిగిన అవగాహన కారణంగా ఫార్మా స్టాక్‌లలో విపరీతమైన విజృంభణ జరిగింది. డయాగ్నస్టిక్ స్టాక్స్ విషయంలో కూడా అదే జరిగింది. కానీ కోవిడ్ ముగిసిన తర్వాత ఫార్మా-హెల్త్‌కేర్ రంగ స్టాక్‌లు గత రెండేళ్లుగా క్షీణించాయి లేదా ఈ రంగానికి చెందిన స్టాక్‌లు పరిమిత పరిధిలో ట్రేడింగ్ ప్రారంభించాయి. కానీ ఫార్మా రంగ స్టాక్‌లకు 2023 సంవత్సరం చాలా బాగుంది. ఈ రంగ షేర్లలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు బలమైన రాబడిని పొందారు.

ముందుగా దాని వాటాదారులకు అద్భుతమైన రాబడిని అందించిన అరబిందో ఫార్మా స్టాక్ గురించి తెలుసుకుందాం. మార్చి 2020లో రూ.288 షేర్ మార్చి 2021లో రూ.1063కి చేరింది. కానీ కరోనా ముగిసిన తర్వాత 3 ఫిబ్రవరి 2023న స్టాక్ రూ. 397కి పడిపోయింది. అయితే ఇప్పుడు ఈ షేరు దాదాపు రూ.872 వద్ద ట్రేడవుతోంది. అంటే 7 నెలల్లోపు అంటే 2023లో స్టాక్ 120శాతం రాబడిని ఇచ్చింది.

ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ వారు అర్హులు కాదు: సుప్రీం తీర్పు

ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు పాఠాలు బోధించడానికి బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు కాదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. రాజస్థాన్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు ఈ తీర్పును వెలువరించింది. బీఎడ్‌ పూర్తి చేసిన వారి నుంచి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు మెరుగైన బోధనను ఆశించలేమని తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్‌జీటీ పోస్టులకు బీఎడ్‌ అభ్యర్థులు కూడా అర్హులేనని ప్రకటిస్తూ నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) 2018లో నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఎన్‌సీటీఈ నోటిఫికేషన్‌ను కొట్టివేస్తూ.. రాజస్థాన్‌లో దేవేశ్‌ శర్మ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో అక్కడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. హైకోర్టు ఉత్తర్వులను సమర్థిస్తూ జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ సుధాంశు ధూలియాల ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. ‘ప్రాథమిక పాఠశాలల టీచర్‌ పోస్టులకు బీఎడ్‌ను అర్హతగా చేరుస్తూ ఎన్‌సీటీఈ తీసుకున్న నిర్ణయం ఏకపక్షంగా, అహేతుకంగా కనిపిస్తోంది. పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యతోపాటు నాణ్యమైన విద్యను అందించాలని విద్యాహక్కు చట్టం చెబుతుందని.. నాణ్యతలో రాజీపడితే ఉచిత, నిర్బంధ విద్యకు అర్థమే ఉండదని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. నాణ్యమైన విద్య అందించాలంటే అర్హులైన ఉత్తమ ఉపాధ్యాయులను నియమించాలని తెలిపింది.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు

స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. అన్నదాతల ఆర్థిక స్థితిగతులు, వారిలో పెరుగుతున్న ఆందోళనను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్‌ మేరకు రూ.లక్ష లోపు ఉన్న రుణమాఫీ ప్రక్రియను సోమవారంతో పూర్తి చేశారు. ఈ విషయాన్ని సీఎం కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. దీనిపై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ట్విట్టర్‌ వేదికగా ‘రావు రూ. 99,999 లోపు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తూ, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. కేంద్రం ఎన్ని ఆర్థిక అవరోధాలు సృష్టించినా, కరోనా వంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా రైతు సంక్షేమం విషయంలో సీఎం గారు ఏనాడూ రాజీ పడలేదు.

ఎర్రకోటపై 10వ సారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. 77వ స్వాతంత్ర్య్ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 10వ సారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. త్రివర్ణ పతాకం ఆవిష్కరణ కంటే ముందుగా రాజ్‌ఘాట్‌ వద్ద జాతీపిత మహాత్మాగాంధీకి ప్రధాని నివాళులర్పించారు. దేశం నలుమూలల నుంచి 1800 మందిని అతిధులుగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆహ్వానించారు. వారిలో 400 మంది సర్పంచ్‌లు ఉన్నారు. స్వాతంత్ర్య వేడుకలకు 10వేల మందితో నాలుగంచెల ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆజాదీ కా అమృతోత్సవ వేడుకలు ముగియనున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని మోడీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ జెండా ఆవిష్కరణతో వరుసగా 10వసారి ఎర్రకోటపై మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ ప్రజలందరికీ ప్రధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదని.. దేశం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారన్నారు. అమరవీరుల త్యాగఫలితమే స్వాతంత్ర్యం. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని ప్రధాని మోడీ అన్నారు. ఎందరో త్యాగం ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. అమరవీరుల త్యాగ ఫలితమే స్వాతంత్ర్యమన్నారు. దేశంలో సుస్థిర ప్రభుత్వం ఉందని.. అదే దేశాన్ని ముందుకు నడిపిస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. దేశంలో సుస్థిర, శక్తివంతమైన ప్రభుత్వం అవసరమని అన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచారు కాబట్టే సంస్కరణలు తీసుకొచ్చామన్నారు.

ప్రమాదకరంగా ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌.. కొంప ముంచుతున్న చిరుతిండ్లు

రుచి కోసం… పాస్కో టైంలో ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఫారిన్ ఫుడ్స్ కొంటాం. వాటిని తయారుచేసే సమయంలో సరైన వంటనూనె వాడకపోవడం వల్ల కొంప పాడైపోతుంది. ముఖ్యంగా ‘ట్రాన్స్ ఫ్యాట్’ ఏటా లక్షల మందిని చంపుతోంది. పారిశ్రామికంగా తయారైన ‘వనస్పతి’ అనే ఈ నూనె/కొవ్వు కారణంగా మన దేశంలో ప్రతి నిమిషానికి ఒకరు చనిపోతున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు ఇతర పరిశోధనా సంస్థలు నిర్ణయించాయి. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వమే ఈ నెల 11న లోక్‌సభలో వెల్లడించింది.

ట్రాన్స్ ఫ్యాట్ అనేది అసంతృప్త కొవ్వు ఆమ్లం. ఇది రెండు విధాలుగా తయారు చేయబడింది. మనం తినే మాంసం, ఆవులు, మేకలు మరియు గొర్రెల నుండి వచ్చే పాలు మరియు పాల ఉత్పత్తులలో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. కానీ ఇది సహజంగా ఉత్పత్తి చేయబడుతుంది మరియు చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. కాబట్టి పెద్దగా ప్రమాదం లేదు. పారిశ్రామికంగా, రసాయన ప్రక్రియ ద్వారా తినదగిన నూనెలు ట్రాన్స్‌ఫ్యాట్‌లుగా మార్చబడతాయి. క్లుప్తంగా దీనిని సింథటిక్ ఆయిల్ అంటారు. సాధారణ పరిభాషలో వనస్పతి అంటారు. ఇది నూనె వంటి ద్రవ, ఘన రూపంలో తయారు చేయబడుతుంది.

చమురు కంపెనీలకు దెబ్బ.. విండ్ ఫాల్ ట్యాక్స్‎ను పెంచిన ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలకు గట్టి షాక్ ఇచ్చింది. పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను పెంచుతున్నట్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచి పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ టన్నుకు రూ.4,250 నుంచి రూ.7,100కు పెరిగినట్లు ప్రభుత్వం ఈ విషయంపై నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అంతకుముందు ఆగస్టు 1న ప్రభుత్వం టన్నుకు రూ.1600 ఉన్న విండ్ ఫాల్ ట్యాక్స్ ను రూ.4250కి పెంచింది. క్రూడ్ పెట్రోలియంతో పాటు డీజిల్ ఎగుమతిపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ)ని కూడా పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం.. లీటర్ రూ.1 నుంచి రూ.5.50కి పెంచింది. ఇది కాకుండా జెట్ ఇంధనం అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)పై కూడా లీటరుకు 2 రూపాయల చొప్పున సుంకం విధించబడింది. మరోవైపు పెట్రోల్‌పై ప్రభుత్వం ఎలాంటి Selected Area Electron Diffraction (SAED) రుసుమును విధించలేదు.

ఇక సూర్యూడి పైకి.. సెప్టెంబర్‌లో ఆదిత్య-ఎల్‌1 ప్రయోగం

ఇప్పటి వరకు చంద్రుడిపై రహస్యాలను శోధిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. ఇకపై సూర్యుడి రహస్యాలను చేధించడం కోసం ప్రయత్నాలు మొదటి పెట్టింది. ఇందుకు సంబంధించిన ప్రయోగాలను చేయడానికి ఇస్రో ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఏడాది ఇప్పటికే 6 ప్రయోగాలను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో.. అదే జోష్‌లో మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. ఇటీవల చంద్రయాన్-3 సక్సెస్ తరువాత తదుపరి మిషన్‌కు సిద్ధమవుతోంది. తొలిసారి సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు రాకెట్‌ను పంపించనుంది. ఇందుకోసం ఆదిత్య L1 రాకెట్‌ను లాంచ్ చేయనుంది. సూర్యుడిపై అధ్యయనం చేసే మొదటి అంతరిక్ష ఆధారిత భారతీయ మిషన్ ఇదే కానుంది. అంతరిక్ష నౌక భూమి నుంచి 1.5 మిలియన్ కిమీ దూరంలో ఉన్న సూర్య-భూమి వ్యవస్థ లగారెంజ్ పాయింట్ 1 చుట్టూ ఒక కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. సెప్టెంబర్‌లో ఆదిత్య ఎల్‌1 ప్రయోగానికి ఏర్పాట్లు సైతం ప్రారంభించింది. ఆదిత్య ఎల్‌1 ప్రయోగంలో శాటిలైట్‌ను సెప్టెంబర్‌ మొదటివారంలో పీఎస్‌ఎల్వీ సీ57 వాహకనౌక ద్వారా నింగిలోకి పంపనున్నది. సూర్యుడి పుట్టుక, వాతావరణం గురించి లోతైన అధ్యయనం కోసం ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • Independence Day
  • PM Modi
  • telugu news
  • Top Headlines @9AM

తాజావార్తలు

  • Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కెరీర్‌లో సచిన్ సో స్పెషల్.. దెబ్బకు దశ తిరిగింది!

  • Iran-Israel War: రైల్లో ప్రయాణం చేయొద్దు.. ఇరానీయులకు ఇజ్రాయెల్ హెచ్చరిక

  • Agarbatti Scam: అగరబత్తీల తయారీ పేరుతో రూ. 25 కోట్ల కుచ్చు టోపీ.. జాగ్రత్త సుమీ.!

  • Liquor Shop Holidays: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ తేదీల్లో వైన్ షాపులు క్లోజ్!

  • Cyber Crime Police Crack Down : సైబర్ దొంగలకు షాక్.. కోట్ల రికవరీ ఎలా సాధ్యమైంది..?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions