NTV Telugu Site icon

Top Headlines@ 9 AM: టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

*చల్లబడిన వాతావరణం.. హైదరాబాదులో పలుచోట్ల భారీ వర్షం..
హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరైన రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నారు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచే అక్కడక్కడ భారీ వానలు పడుతున్నాయి. చిక్కడపల్లి, హిమాయత్ నగర్, అబిడ్స్, బర్కత్ పురా, కార్వాన్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, అమీర్ పేట, బంజారాహిల్స్, రాజేంద్రనగర్‌, తుర్కయంజాల్‌, కొత్తపేట, సరూర్‌నగర్‌, నాగోల్‌, చైతన్యపురి, చంపాపేట, సైదాబాద్‌, శంషాబాద్‌, ఆదిబట్ల, చార్మినార్‌, నాంపల్లి, మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, వనస్థలిపురం, కాచిగూడ, జల్‌పల్లిలో భారీ వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వర్షం పడుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాన కారణంగా నాళాల నిండి నుంచి నీరు పైకి రావడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ఉదయం కార్యాలయాలకు వెళ్లే సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. రెండు రోజుల వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ముందుగానే తెలిపింది. ఈ నెల 20 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య ఎండలో బయటకు వెళ్లవద్దని వైద్య, ఆరోగ్య శాఖ సూచిస్తోంది. వెళ్లే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక నిన్న సాయంత్రం నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. డిచ్‌పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండలో వర్షం కురిసింది. మరోవైపు ఇందల్వాయి, డిచ్‌పల్లి మండలాల్లో వడగళ్ల వాన కురిసింది. అలాగే కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో అల్లాడిపోయిన ప్రజలకు వర్షంతో కాస్త ఊరట లభించింది.

 

*19వ రోజుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేటి షెడ్యూల్ ఇదే..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది. విజయవాడలో తనపై రాయి దాడి జరిగినా.. నుదిటిపై గాయం మానకపోయినా.. బస్సుయాత్రను ముందుకు సాగిస్తున్నారు ఏపీ సీఎం.. ఇక, 19వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా.. ఇవాళ ఉదయం 9 గంటలకు గోడిచర్ల నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం వరకు నక్కపల్లి, పులవర్తి, యలమంచిలి బైపాస్‌ మీదుగా అచ్యుతాపురం చేరనుంది. భోజన విరామం తర్వాత నరిసింగపల్లి మీదుగా చింతలపాలెంకు బస్సుయాత్ర చేరనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు చింతలపాలెం దగ్గర సీఎం జగన్‌ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. తర్వాత బయ్యవరం, కశింకోట, అనకాపల్లి బైపాస్ అస్కపల్లి మీదుగా చిన్నయపాలెం వరకు బస్సుయాత్ర కొనసాగనుంది. రాత్రి చిన్నయపాలెంలో రాత్రి బస శిబిరానికి చేరుకోనున్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి. బస్సు యాత్రలు, రోడ్‌షోలు, ముఖాముఖిలు నిర్వహిస్తూనే.. బస్సు యాత్రలో భాగంగా వైసీపీ భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తోన్న విషయం విదితమే.. సీఎం జగన్‌పై రాయి దాడి తర్వాత పోలీసులు మరింత భద్రత కల్పిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డులో సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. కాగా, ఎన్నికల ప్రచారంలో ఇడుపులపాయలో మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించిన సీఎం జగన్‌.. ఇచ్చాపురం వరకు చేరుకోనున్న విషయం విదితమే.

 

*రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్‌ బస్సుయాత్ర, రోడ్‌షోలు.. రూట్‌మ్యాప్‌ ఖరారు చేసిన బీఆర్‌ఎస్‌..
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ సోమవారం (22) నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, బస్సు యాత్రలతో ఆయన పర్యటించనున్నారు. అయితే కేసీఆర్ ఇప్పటికే చేవెళ్ల, మెదక్ లోక్ సభ నియోజకవర్గాల్లో భారీ సభల్లో ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఈ నెల 22 నుంచి రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, ఆయా నియోజకవర్గాల పరిధిలో బస్సుయాత్ర చేస్తూ రోడ్‌షోల్లో పాల్గొంటారు. అయితే బీఆర్‌ఎస్ పార్టీ నేతలు రోడ్‌షోలకు సంబంధించిన ప్రాథమిక రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. తొలిరోజు మిర్యాలగూడ నుంచి రోడ్‌షో ప్రారంభమై హుజూర్‌నగర్‌, కోదాడ మీదుగా సూర్యాపేటకు చేరుకుని కేసీఆర్ రాత్రికి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు సూర్యాపేట నుంచి తిరుమలగిరి, జనగామ, ఆలేరు మీదుగా రాత్రికి ఎర్రవల్లి చేరుకుంటారు. మూడో రోజు ఎర్రవల్లి నుంచి వరంగల్‌లో రోడ్‌షో జరగనుంది. రాత్రిపూట అక్కడే ఉండండి. ఈ యాత్ర మరుసటి రోజు తొర్రూరు, మరిపెడ నుంచి ఖమ్మం చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. అదేరోజు రాత్రి ఖమ్మంలో బస చేసిన అనంతరం వైరా, తల్లాడ, కొత్తగూడెంలలో జరిగే రోడ్‌షోల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. అదేరోజు రాత్రి కొత్తగూడెంలో బస చేసి అక్కడి నుంచి ఇల్లెందు, మహబూబాబాద్, నర్సంపేటలో రోడ్డుషోలో పాల్గొని రాత్రికి వరంగల్ చేరుకుంటారు. మరుసటి రోజు భూపాలపల్లి, పరకాల, జమ్మికుంటల్లో ప్రచారంలో పాల్గొంటారు. సింగపూర్‌లో రాత్రిపూట. అక్కడి నుంచి మరుసటి రోజు పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాలలో ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. మంచిర్యాల నుంచి నేరుగా కరీంనగర్ చేరుకుని అక్కడే బస చేస్తారు. కరీంనగర్ నుంచి జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి వరకు జరిగే రోడ్‌షోల్లో పాల్గొంటారు. రాత్రి మెట్‌పల్లిలో బస చేసిన అనంతరం మరుసటి రోజు బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని మోర్తాడ్, కమ్మర్‌పల్లి తదితర గ్రామాల్లో రాస్తారోకోల్లో పాల్గొని ఆర్మూరు మీదుగా నిజామాబాద్ చేరుకుంటారు. రాత్రి నిజామాబాద్‌లో బస చేస్తారు. ఆ తర్వాత నిజామాబాద్ నుంచి బాన్సువాడ, ఎల్లారెడ్డి నుంచి మెదక్ చేరుకుంటుంది. మెదక్‌లో బస చేసిన అనంతరం మరుసటి రోజు నర్సాపూర్, మేడ్చల్, పటాన్‌చెరువు నియోజకవర్గాల్లో రోడ్‌షోల్లో పాల్గొంటారు. ఇక రాత్రి హైదరాబాద్‌లో బస చేస్తారు. మరుసటి రోజు వనపర్తి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాగర్ కర్నూల్ లో పర్యటించి రాత్రికి వనపర్తిలో బస చేసే అవకాశం ఉంది. అక్కడి నుంచి తెల్లారి జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని అయిజ, గద్వాలలో ప్రచారంలో పాల్గొంటారు. గద్వాలలో రాత్రి బస చేస్తారు. మిగిలిన నియోజకవర్గాల రూట్ మ్యాప్ ఇంకా ఖరారు కాలేదు. దీనికి సంబంధించి రెండు రోజుల్లో పార్టీ స్పష్టమైన రూట్ మ్యాప్ విడుదల చేయనుంది. అయితే అంతిమ సభను సిద్దిపేటలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. రోడ్‌షోలతో పాటు మధ్యలో ఒకటి రెండు చోట్ల సమావేశాలు కూడా నిర్వహించాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.

 

*తాగొచ్చి గొడవ చేస్తున్నాడని.. మామతో కలిసి భర్తను చంపిన భార్య
ఏపీలో ఇటీవల భర్తలు, భార్యల హత్యలు కలకలం రేపుతున్నాయి. ప్రతి నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి వార్త వినాల్సి వస్తోంది. అయితే భార్యను చంపిన భర్త అని లేదా భర్తను చంపిన భార్య అని.. తాజాగా మరో ఘటన సంచలనంగా మారింది. ఓ భార్య తన భర్తను కడతేర్చింది. విజయనగరం జిల్లా గరివిడి మండలం వెదుళ్లవలసలో దారుణం చోటుచేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేని ఓ భార్య తన మామ సహకారంతో అతడిని కిరాతంగా హత్య చేసింది. తాగొచ్చి నిత్యం వేధింపులకు గురి చేస్తుండటంతో విచక్షణ కోల్పోయి అతడిని అంతమెుందించింది. వెదుళ్లవలసకు చెందిన కొలుసు అప్పన్న, దేవి ఇద్దరు భార్యాభర్తలు. తాగుడుకు బానిసైన అప్పన్న తరచూ భార్యను డబ్బుల కోసం ఇబ్బంది పెట్టేవాడు. ఆమెపై అనుమానంతో వేధింపులకు పాల్పడేవాడు. శుక్రవారం ఇంటికి తాగి వచ్చిన భర్తతో గొడవకు దిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి వారిద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉండడంతో విసుగుచెందింది. క్షణికావేషానికి లోనై తాగొచ్చి గొడవ చేస్తున్న భర్తను ఉరేసి భార్య దేవి హత్య చేసింది. ఈ హత్యకు మామ ముంత సన్యాసిరావు సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు. తాగుడికి బానిసై రోజూ ఇంట్లో పోరు పెడుతున్నాడని.. తాగిన మైకంలో ఉన్న అప్పన్నను భార్య హత్య చేసింది. రోజూ తాగొచ్చి గొడవకు దిగడం, వేధింపులకు గురిచేస్తుండడంతో.. కట్టుకున్న భర్తనే హత్య చేసింది ఆ ఇల్లాలు.

 

*అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుల్లోకి ఎక్కనున్న 2024 ?
వాతావరణ రికార్డులో అత్యంత వేడి సంవత్సరంగా అంచనా వేయబడింది. సముద్రం కూడా సురక్షితం కాదు. వాతావరణ రికార్డులో 2024 అత్యంత వేడిగా ఉండే సంవత్సరంగా 55శాతం అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది మాత్రమే కాదు, వారు ఈ సంవత్సరం ఐదు అత్యంత వేడి సంవత్సరాలలో చేర్చబడిన 99శాతం సంభావ్యతను వ్యక్తం చేశారు. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) నేషనల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఇన్ఫర్మేషన్ (NCEI) తాజా నివేదికలో ఈ దావా చేయబడింది. నివేదిక ప్రకారం, మార్చిలో సగటు ఉష్ణోగ్రత 20వ శతాబ్దంలో మార్చి సగటు ఉష్ణోగ్రత కంటే 1.35 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదైంది. ఇరవయ్యవ శతాబ్దపు సగటు ఉష్ణోగ్రత కంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం ఇది వరుసగా 48వ మార్చి. పెరుగుతున్న ఉష్ణోగ్రత ప్రభావం కేవలం భూమిపైనే పడిందని కాదు, దాని ప్రభావం సముద్రాలపై కూడా నమోదైంది. నివేదిక ప్రకారం, మార్చి 2024లో చాలా ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా ఉన్నాయి. సగటు సముద్ర ఉష్ణోగ్రత సాధారణం కంటే 1.01 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. అంతకుముందు 2016లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత అత్యధికంగా 0.83 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. నివేదిక ప్రకారం, మార్చి 2024లో ఆఫ్రికా, యూరప్, దక్షిణ అమెరికా, అలాగే తూర్పు ఉత్తర అమెరికా, తూర్పు ఆసియా, తూర్పు ఆస్ట్రేలియాలో ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా ఉన్నాయి. పశ్చిమ ఉత్తర అమెరికా, మధ్య ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలు సగటు కంటే చాలా చల్లగా ఉన్నాయి. ఆఫ్రికా, దక్షిణ అమెరికా తమ వెచ్చని మార్చిని ఎదుర్కొన్నప్పటికీ ఇది ఐరోపాకు రెండవ వెచ్చని మార్చి. కార్బన్ డయాక్సైడ్, ఇతర గ్రీన్హౌస్ వాయువుల వలె, ఉపరితలం నుండి బదిలీ చేయబడిన వేడిని బంధిస్తుంది. అంతరిక్షంలోకి తప్పించుకోకుండా చేస్తుంది. ఫలితంగా భూమి, ఉష్ణోగ్రత పెరుగుతోంది. తీవ్రమైన వాతావరణ సంఘటనలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఈ విషయంలో NOAA డేటా వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ స్థాయి 424 పార్ట్స్ పర్ మిలియన్ (ppm)కి చేరుకుందని చూపిస్తుంది. గత లక్షల సంవత్సరాలలో ఇది కనిపించలేదు. ఇది భూమి, ఉపరితల ఉష్ణోగ్రత పరంగా ఇది నాల్గవ వెచ్చని మార్చిని చేస్తుంది. సాధారణం కంటే 2.09 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా నమోదైంది. ఇది మాత్రమే కాదు, జూన్ 2023 నుండి ప్రపంచ స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కొత్త రికార్డును నెలకొల్పడం ఇది వరుసగా పదో నెల. అంటే జూన్ 2023 నుండి, పెరుగుతున్న ఉష్ణోగ్రత కొత్త రికార్డును నెలకొల్పని ఒక్క నెల కూడా లేదు.

 

*ముస్లిం మహిళకు రైడ్ ఇవ్వడంతో.. యువకుడిపై దాడి.. చివరకి..
బెంగళూరు నగరంలో గురువారం సాయంత్రం ఉమేష్ అనే యువకుడు తన సహోద్యోగి పర్వీన్‌ ను పని ముగించుకున్నా తర్వాత దింపుతున్న సమయంలో ముస్లిం వర్గానికి చెందిన కొందరు యువకులు అతనిపై దారుణంగా దాడి చేసారు. నగరంలోని ఈరజ్జనహట్టికి చెందిన ఉమేష్‌, కోహినూర్‌ వస్త్ర దుకాణంలో ఉద్యోగి. ముస్లిం మహిళకు రైడ్‌ ఇచ్చాడనే కారణంతో చిత్రదుర్గలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం నాడు రాత్రి ప్రాంతంలో పర్వీన్‌ను దింపేందుకు ఉమేష్ చెలుగుడ్డ వైపు వెళ్తుండగా., దాదాపు ఐదుగురు యువకులు అతనిపై విచక్షణ రహితంగా ప్రవర్తించి, అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో ఉమేష్ తలతో పాటు శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి జరిగిన తర్వాత ఉమేష్ ధైర్యంగా చిత్రదుర్గ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఆ తర్వాత పోలీసు సూపరింటెండెంట్ ధర్మేందర్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ దినకర్ చికిత్స పొందుతున్న ప్రభుత్వాసుపత్రికి వచ్చి పరామర్శించారు. ఇంతలో, హిందూ సంఘాల సభ్యులు ఆసుపత్రి వెలుపల గుమిగూడి నిందితులకు వ్యతిరేకంగా నిరసన చేస్తూ.. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇందుకు సంబంధించి విచారణలో., పర్వీన్ మాట్లాడుతూ.. రైడ్ సమయంలో తనను వేధించాడని ఆరోపిస్తూ ఉమేష్‌ పై ఫిర్యాదు చేసింది. ఉమేష్ అనుచితంగా ప్రవర్తించాడని., అలాగే చెప్పిన చోటికి కాకుండా వేరే ప్రదేశానికి తనను తీసుకెళ్లడానికి ప్రయత్నించాడని ఆమె పేర్కొంది. అదృష్టవశాత్తూ., తనని సోదరుడి స్నేహితులు జోక్యం చేసుకుని సురక్షితంగా ఇంటికి చేర్చారని వెల్లడించింది. దింతో ఈ సమస్యాత్మక పరిస్థితి వెనుక ఉన్న వాస్తవాన్ని వెలికితీసేందుకు సమగ్ర దర్యాప్తు చేశునట్లు అధికారులు తెలిపారు.

 

*బెంగళూరులో పోలీసులపై దాడి.. ఎనిమిది మంది నైజీరియన్లు అరెస్ట్..
బెంగళూరులోని రాజనుకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మావల్లిపురలో ఎనిమిది మంది నైజీరియన్స్ ను పోలీసు అధికారులపై దాడి చేసినందుకు అరెస్టు చేసారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) మావల్లిపుర ప్రాంతంలో డ్రగ్స్ పెడ్లర్ గురించి సమాచారం అందుకుంది. దీంతో వారు సోదాలు నిర్వహించారు. అయితే అక్కడికి చేరుకోగానే నైజీరియా జాతీయులు పోలీసులపై దాడి చేశారు. రాష్ట్ర పారామిలటరీ దళం దిస్వాట్‌ తో కలిసి సీసీబీ అధికారులకు ప్రతిఘటన ఎదురైంది. వాగ్వాదం సందర్భంగా నిందితులు పోలీసు వాహనం అద్దాన్ని ధ్వంసం చేసి నలుగురు అధికారులను గాయపరిచారు. సంఘటన స్థలం నుంచి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించినప్పటికీ., కొద్దిసేపటికే నిందితులు పట్టుబడ్డారు. రాజానుకుంట పోలీస్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయాలపాలైన పోలీసులు హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారో. ఏకంగా పోలీసులపైనే దాడి చేశారంటే డ్రగ్స్ ముఠా మనుషులు ఎంతకు తెగించారో అర్థమవుతుంది. ప్రస్తుతం దేశంలోని ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యల నిబంధనలలో వారి ఆటలు సాగకపోవడంతో ఇలాంటి దుచర్యలకు తెగబడుతున్నారు.

 

*సైబర్ సైన్యాన్ని సిద్ధం చేస్తున్న చైనా..!
బలమైన సైనిక వ్యవస్థతో పాటు ఇప్పటికే పొరుగు దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నా డ్రాగన్ కంట్రీ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మిలిటరీ బలోపేతంలో భాగంగా మరో కొత్త సైన్యాన్ని తయారు చేసేందుకు శ్రీకారం చూట్టింది. సైబర్ సైన్యం ఏర్పాటు చేసేందుకు చైనా కసరత్తు చేస్తుంది. ఇన్‌ఫర్మేషన్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ (ఐఎస్‌ఎఫ్‌) పిలిచే ఈ కొత్త విభాగానికి యుద్ధాలను గెలిపించే సామర్థ్యం ఉందని డ్రాగన్ కంట్రీ చైనా భావిస్తుంది. దీనికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అనుమతి ఇచ్చారు. ఇక, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి పెద్ద సైన్యమైన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి ఇది వ్యూహాత్మకంగానే కాకుండా కీలకంగా మారనుందని తెలిపారు. చైనా సైన్యంలో అత్యున్నత కమాండ్‌ అయిన సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ (CMC) అధిపతిగా, అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా (CPC) అధినేతగా తాను వ్యవహరిస్తున్నాట్లు పేర్కొన్నారు. ఐఎస్‌ఎఫ్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రధాన నిర్ణయాన్ని.. బలమైన సైన్యాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సీపీసీ, సీఎంసీలు ఈ మేరకు నిశ్చయించుకున్నట్లు తెలిపారు. రాజకీయ, సైబర్‌ నేరాలను ఎదుర్కొనేందుకు 2015లో ఏర్పాటు చేసిన స్ట్రేటజిక్‌ సపోర్ట్‌ ఫోర్స్‌(SSF)కు నవీన రూపమే ఐఎస్‌ఎఫ్‌ అని పరిశీలకులు తెలియజేస్తున్నారు.

 

*నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఢీ..
ఐపీఎల్-2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొడుతోంది. 277, 287 రికార్డు పరుగులు సాధించి ప్రత్యర్థి జట్లకు ప్రమాదకర హెచ్చరికలను జారీ చేసింది. టైటిల్‌యే లక్ష్యంగా విజయాలతో SRH దూసుకుపోతుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచింది. ఇక, హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న సన్‌రైజర్స్ టీమ్ మరో ఆసక్తికర సమరానికి రెడీ అయింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీ కొట్టబోతుంది. బలాబలాలు పరంగా ఢిల్లీ కంటే హైదరాబాద్ జట్టే హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. కానీ సొంత మైదానంలో ఢిల్లీ జట్టును తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన స్థితికి ఢిల్లీ క్యాపిటల్స్ కి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాలని సన్‌రైజర్స్ అనుకుంటుంది. జట్టు కూర్పుపై ప్రత్యేక నజర్ పెట్టింది. ఈ సీజన్ ఆరంభంలో అలరించి తర్వాత పేవల ప్రదర్శన చేస్తున్న షాబాజ్ అహ్మద్‌ను పక్కన పెట్టాలని చూస్తుంది. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు హైదరాబాద్, ఢిల్లీ 23 మ్యాచ్‌ల్లో పోటీ పడగా.. ఇరు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా కొనసాగింది. ఎస్‌ఆర్‌హెచ్ 12 సార్లు, ఢిల్లీ 11 సార్లు గెలిచాయి. అయితే, గత మూడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌పై ఢిల్లీదే పైచేయి సాధించింది. 2022లో జరిగిన ఒక్క మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌యే నెగ్గగా, గత సీజన్‌లో చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి.