Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 5pm 31 12 2024

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Published Date :December 31, 2024 , 5:19 pm
By Gogikar Sai Krishna
  • ఏపీ హైకోర్టులో మాజీ మంత్రికి ఊరట
  • హైకోర్టులో ఫార్ములా కేసు సంబంధించిన ప్రశ్నలు ఇవే
  • ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు
  • న్యూ ఇయర్‌ వినోదం.. కారాదు విషాదం
Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్లు క్లోజ్ చేస్తున్నాం.. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు కొనసాగుతాయి!

న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్లు క్లోజ్ చేస్తున్నాం అని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఓఆర్ఆర్‌పై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలు, హెవీ వెహికిల్స్‌ను అనుమతిస్తామని చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు కొనసాగుతాయని, పట్టుపడిన వారిపై కఠిన చర్యలు తప్పని రాచకొండ సీపీ హెచ్చరించారు. న్యూఇయర్‌ వేడుకల నేపథ్యంలో నగరంలోని మూడు కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబరు 31 రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ… ‘ప్రమాదాల నివారణకు ఫ్లైఓవర్లు క్లోజ్ చేస్తున్నాం. 129 ఫాంహౌస్‌లు, 6 పబ్‌లు, 180 వరకు హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఉన్నాయి. ఇప్పటికే వారికి అవసరమైన హెచ్చరికలు జారీ చేశాము. మహిళలకు అగౌరవం జరగకుండా చూడాలంటూ ఈవెంట్ నిర్వాహకులకు చెప్పాము. షీటీమ్స్ ఉంటాయి. మాజీ ప్రధాని మన్మోహన్ చనిపోయారు. సంతాపం దినాలు ఉన్నాయి కాబట్టి మా డిపార్ట్మెంట్ తరుపున ఎలాంటి కేక్ కటింగ్స్ ఉండవు. ఈ రోజు కొన్ని చిన్నచిన్న కేసుల్లో గంజాయి, పాపిస్ట్రా డ్రగ్ పట్టుకున్నాం. ఓఆర్‌ఆర్‌పై భారీ వాహనాలు, ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తాము’ అని తెలిపారు.

ప్రతి ఏడాది ఫీజు పెంచుకోవాలనుకోవడం సమంజసం కాదు: విద్యా కమిషన్ ఛైర్మన్

ప్రైవేట్ విద్యా సంస్థలను ఈ ప్రభుత్వం నియంత్రిస్తుందని విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళీ అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రతి ఏడాది ఫీజు పెంచుకోవాలనుకోవడం సమంజసం కాదన్నారు. ఫీజుల నియంత్రణ కోసం చట్టం తీసుకురావాలని, ప్రభుత్వానికి తాము సిఫార్సు చేస్తున్నామని తెలిపారు. పిర్యాదులు స్వీకరణ పరిష్కారం కోసం అధికారాలతో కూడిన ఒక ప్రత్యెక వ్యవస్థ ఉండాలన్నారు. మాతృ భాష నేర్చుకోవాలి కానీ.. మాతృ భాషలోనే బోధన అంటే కరెక్ట్ కాదని ఆకునూరి మురళీ పేర్కొన్నారు.

‘ప్రైవేట్ విద్యా సంస్థలను ఈ ప్రభుత్వం నియంత్రిస్తుంది. ఫీజుల నియంత్రణ కోసం చట్టం తీసుకురావాలి. ఈ విషయమై ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాం. ప్రైవేట్ విద్యా సంస్థలను స్ట్రీమ్ లైన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్ అసంబద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఒక స్కూల్లో అప్లికేషన్ ఫీజు రూ.4,500గా ఉంది. స్కూల్స్ సేల్స్ యాక్టివిటీ నుండి పూర్తిగా బయటకు రావాలి. ప్రభుత్వం ఆ వైపున చర్యలు తీసుకుంటుంది. పిర్యాదులు స్వీకరణ పరిష్కారం కోసం అధికారాలతో కూడిన ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలి’ అని విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళీ అన్నారు.

గ్రామస్తులతో ముఖాముఖి.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

పల్నాడు జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. యలమందలో లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి నేరుగా పెన్షన్లు అందించారు.. ఆ తర్వాత గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఒకప్పుడు ముఖ్యమంత్రి వస్తున్నారంటే పరదాలు కట్టేవారు.. ఆడంబరాలు చేసేవారు.. చుట్టుపక్కల చెట్లు కొట్టేసేవారు అని ఎద్దేవా చేశారు.. ఒక ప్రజా ప్రతినిధి వస్తున్నారంటే దానికి గుర్తుగా మొక్కలు నాటాలి.. చెట్లు కొట్టకూడదు అని సూచించారు.. నేను ప్రజల ముఖ్యమంత్రిగా.. మీ స్నేహితుడిగా.. మీ ముందుకు వచ్చాను.. ఈ స్థితిగతులు తెలుసుకోవటానికి వచ్చాను.. మీ కష్టాలను బాధను పంచుకోవడానికి వచ్చాను.. అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని, మీ మొహాల్లో ఆనందం చూడాలని వచ్చాను.. గత ప్రభుత్వంలో నవ్వటానికి కూడా, స్వేచ్ఛ లేని పరిస్థితి ఉండేది.. ఈ రాష్ట్రంలో ఏ ఇంటిలో కష్టం వచ్చినా ,వాళ్ళింట్లో నేను ఒక ప్రాణ స్నేహితుడిగా మారి వాళ్ళని కాపాడుకుంటాను.. భవిష్యత్తులో ఉపక్కర పరిస్థితులు వస్తే డ్రోన్ లు ఉపయోగించి, మీ ఇళ్ళకే మెడిసిన్స్ పంపించే విధంగా టెక్నాలజీని అభివృద్ధి చేశాం అన్నారు చంద్రబాబు..

ఏపీ హైకోర్టులో మాజీ మంత్రికి ఊరట..

ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట లభించింది. తొందరపాటు చర్యలు వద్దని.. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పోలీసులకు ఆదేశం ఇచ్చింది. ఈ క్రమంలో.. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రేషన్ బియ్యం మాయం కేసులో ఏ6గా పేర్ని నాని ఉన్నారు. దీంతో.. ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ క్రమంలో.. విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది.

నల్గొండ ప్రజల దశాబ్దాల కల SLBC

నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. SLBC ప్రాజెక్ట్ 4 లక్షల ఎకరాలకు నీళ్లిచే ప్రాజెక్ట్ అని, SLBC, బ్రాహ్మణవెళ్ళాంల నాకు ప్రథమ ప్రాధాన్యమన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే కాంట్రాక్టర్లు పనిచేయరని, ⁠కాంట్రాక్టర్ పని చేయకపోతే మంత్రి గారికి చెప్పాలన్నారు మంత్రి కోమటిరెడ్డి. నల్గొండ ప్రజల దశబ్దాల కల SLBC అని ఆయన వ్యాఖ్యానించారు. దయచేసి అధికారులు కంటితుడుపు పనులు చేసే ప్రయత్నం చేయకండని ఆయన సూచించారు. సీరియస్ గా పని చేస్తే అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేయొచ్చన్నారు. SLBC ఒక వరల్డ్ వండర్.. SLBC పూర్తయితే.. ప్రపంచమంతా వచ్చి చూస్తుందని, చాలా భాద్యత తో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.

గత ప్రభుత్వం వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసింది.. నిధులన్నీ మింగేశారు

పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. యలమంద గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి నేరుగా పెన్షన్లు అందించారు. ఆ తర్వాత గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసిందని ఆరోపించారు. కేంద్ర నిధులన్నీ మింగేశారు.. నిధులన్నీ పక్కదారి పట్టించారని తెలిపారు. మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రతి ఇంటికి కులాయి ద్వారా నీరు ఇవ్వాలని ఏర్పాటు చేసిన స్కీము నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. ఆ స్కీం నిర్వహణకు డబ్బులు తెచ్చి పక్కదారి మళ్లించారు.. అనేక స్కీంల డబ్బు దారి మళ్ళిందని చంద్రబాబు తెలిపారు. తాను కష్టపడతానని.. సంపద సృష్టిస్తానని.. ఆ సృష్టించిన సంపాదన పేదవారికి అందిస్తానని చెప్పారు.

న్యూ ఇయర్‌ వినోదం.. కారాదు విషాదం..

టీజీఆర్‌టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. కొత్త సంవత్సరాన్ని శుభప్రదంగా, సురక్షితంగా ప్రారంభించేందుకు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయన చేసిన ఆహ్వానం ప్రజల్లో చైతన్యాన్ని పెంచే విధంగా ఉంది.

“కొత్త సంవత్సరం వేడుకలను మీ కుటుంబ సభ్యులతో మీ ఇళ్లలోనే జరుపుకోండి. ప్రమాదాల నుంచి దూరంగా, సంతోషకరంగా ఉండండి. గతంలో కొత్త సంవత్సరం వేడుకల పేరుతో జరిగిన విషాదాలను గుర్తుంచుకుని, అలాంటి దుస్థితులను పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి,” అని సజ్జనార్ స్పష్టంగా తెలియజేశారు.

విశేషంగా, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలను ప్రస్తావిస్తూ, “మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రాణనష్టానికి కారణం అవుతుందనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీరే కాదు, ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగించే ఆచరణ ఇది. కనుక, న్యూ ఇయర్ వేడుకలలో బాధ్యతగా వ్యవహరించండి” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం

నల్గొండ లోకసభ స్థానం పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులపై జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. 2024 లో అందరికీ మంచి చేశాము.. 2025లో కూడా అలానే చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. ఆరు గ్యారెంటీలు అమలు చేశామని, స్వతంత్ర భారతదేశంలో కులగనన చేయడం మొదటి సారి అని ఆయన అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ, పౌరసరఫరాల శాఖలో పూర్తి పారదర్శకత విధానాలను అమలు చేస్తున్నామని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేలా ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు..

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేష్ కుమార్, సాల్మన్ ఆరోక్య రాజ్‌లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2000 బ్యాచ్‌కి చెందిన ఈ ఇద్దరు అధికారులకు ముఖ్య కార్యదర్శి హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్య కార్యదర్శిగా సురేష్ కుమార్ ను రీడిజిగ్నెట్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం డిప్యూటేషన్ పై సాల్మన్ ఆరోక్య రాజ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు.

హైకోర్టులో ఫార్ములా కేసు సంబంధించిన ప్రశ్నలు ఇవే..

కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఏసీబీ తరుఫున AG సుదర్శన్‌ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఫార్ములా ఈ రేసింగ్‌ కేసులో కేటీఆర్‌ తరుఫున సుప్రీంకోర్టు సీనియర్‌ లాయర్‌ సిద్ధార్థ్‌ దవే వాదనలు వినిపించారు. కేటీఆర్ పైన నమోదైన సెక్షన్లు అతనికి వర్తించవు లాయర్‌ సిద్ధార్థ్‌ దవే కోర్టుకు తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసం బదిలీ అయిన డబ్బు FEO కు చేరింది.. 55 కోట్ల బదిలీ లో ఎక్కడా అవినీతి జరగలేదని, ఎలక్షన్ కోడ్ కు ముందే ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ అగ్రిమెంట్ జరిగిందని.. దీనికి ఎన్నికల నిబంధనలు వర్తించవు
కేటీఆర్‌ తరుపు లాయర్‌ కోర్టుకు తెలిపారు. పాలసీ నిర్ణయాలకు మాత్రమే ఎన్నికల నిబంధనలు వర్తిస్తాయని కోర్టుకు తెలిపారు లాయర్‌. ఈ కేసులో కేటీఆర్ A1 గా చేర్చినప్పుడు FEO ను ఎందుకు నిందితుల జాబితాలో చేర్చలేదని సిద్ధార్థ్‌ దవే ప్రశ్నించారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm chandrababu
  • Formula E Race
  • komatireddy venkat redy
  • ktr
  • New Year

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions