Today Stock Market Roundup 27-03-23: టాప్లో నిలిచిన విజయా డయాగ్నాస్టిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Stock Market Roundup 27-03-23: ఇండియన్ ఈక్విటీ మార్కెట్ ఈ వారాన్ని ఫ్లాట్గా ప్రారంభించింది. ఇవాళ సోమవారం ఉదయం ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి మిశ్రమ సంకేతాలు అందటంతో సూచీలు ఊగిసలాడాయి. తర్వాత లాభాల బాట పట్టాయి. కానీ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. రెపో రేటును పావు శాతం పెంచే అవకాశాలున్నాయంటూ వార్తలు రావటంతో ఇన్వెస్టర్లు స్టాక్స్ కొనుగోళ్ల వైపు మొగ్గుచూపలేదు.
దీంతో ఇండెక్స్లు సాయంత్రం స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకున్నాయి. చివరికి.. సెన్సెక్స్.. 126 పాయింట్లు పెరిగి 57 వేల 653 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ.. స్వల్పంగా 40 పాయింట్లు పెరిగి 16 వేల 985 వద్ద క్లోజ్ అయింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో రిలయెన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, ఐటీసీ, కొటక్ మహింద్రా బ్యాంక్ మంచి పనితీరు కనబరిచాయి. బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, మహింద్రా అండ్ మహింద్రా, నెస్లే ఇండియా వెనకబడ్డాయి.
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
read more: TCS New CEO Krithivasan: టీసీఎస్ CEOగా సరైనోడే. కృతివాసన్పై అందరిదీ ఇదే మాట
నేషనల్ స్టాక్స్ ఎక్స్ఛేంజ్లో అపోలో హాస్పిటల్స్, దివిస్ ల్యాబ్స్, కొటక్ మహింద్రా, ఇన్ఫోసిస్ రాణించగా.. అదానీ పోర్ట్స్, మహింద్రా అండ్ మహింద్రా, టాటా మోటార్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ నేలచూపులు చూశాయి. రంగాల వారీగా చూస్తే.. బీఎస్ఈలో అదర్ అండ్ ఫైనాన్షియల్ సంస్థల స్టాక్స్ వ్యాల్యూ పెరిగింది. నిఫ్టీలో ఇండస్ట్రియల్ అండ్ అదర్ సెక్టార్ల కంపెనీల షేర్ల విలువలు పెరిగాయి.
వ్యక్తిగత స్టాక్స్ను పరిశీలిస్తే.. బీఎస్ఈలో లాభాలు పొందిన సంస్థల జాబితాలో యూనో మిండా టాప్లో నిలవగా ఎన్ఎస్ఈలో విజయా డయాగ్నాస్టిక్స్.. అగ్రస్థానాన్ని పొందింది.
10 గ్రాముల బంగారం ధర 445 రూపాయలు తగ్గింది. గరిష్టంగా 58 వేల 828 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు కూడా దాదాపు ఇదే స్థాయిలో 440 రూపాయలు పడిపోయింది.
అత్యధికంగా 69 వేల 971 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర నామమాత్రంగా 22 రూపాయలు పెరిగింది. ఒక బ్యారెల్ ముడి చమురు 5 వేల 750 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 6 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 38 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!