Today Stock Market Roundup 21-03-23: మణప్పురం.. మస్తు లాభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Stock Market Roundup 21-03-23: ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇవాళ మంగళవారం మంచి జోష్ కనిపించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రేడింగ్ పాజిటివ్గానే నడిచింది. పాశ్చాత్య దేశాల్లో బ్యాంకింగ్ సంక్షోభానికి సంబంధించిన భయాలు తగ్గుముఖం పట్టడం మన మార్కెట్కి కలిసొచ్చింది. దీంతో ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి.
సెన్సెక్స్ మళ్లీ 58 వేల పాయింట్లు దాటింది. చివరికి.. 445 పాయింట్లు పెరిగి 58 వేల 74 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 119 పాయింట్లు పెరిగి 17 వేల 107 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్లోని మొత్తం 30 కంపెనీల్లో 18 కంపెనీలు లాభాలు పొందగా మిగతా 12 కంపెనీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో రిలయెన్స్, ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ట్విన్స్, నెస్లె, టైటాన్, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్ మంచి పనితీరు కనబరిచాయి.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
read more: ChatGPT: మార్కెట్లోకి కొత్త యాంకర్. ఈమెనెప్పుడైనా చూశారా?
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో అదానీ ఎంటర్ప్రైజెస్, ఎస్బీఐ లైఫ్ రాణించాయి. ఐటీసీ, పవర్గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, టెక్ మహింద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్ సంస్థలు రెండు ఇండెక్స్ల్లోనూ నష్టాల బాటలోనే సాగాయి. రంగాల వారీగా పరిశీలిస్తే.. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, కన్జ్యూమర్ డ్యూరబుల్ సూచీలు ఒక శాతం చొప్పున పెరిగాయి. నిఫ్టీ ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్లు మాత్రం నేలచూపులు చూశాయి.
వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. మణప్పురం ఫైనాన్స్కి ప్రాఫిట్స్ కొనసాగాయి. ఈ సంస్థ షేర్ విలువ ఈ నెలలో ఇప్పటివరకు 14 శాతం ర్యాలీ తీసింది. జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ వ్యాల్యూ 4 రోజుల్లోనే 14 శాతం పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 207 రూపాయలు తగ్గింది. గరిష్టంగా 59 వేల 299 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు స్వల్పంగా 28 రూపాయలు పెరిగింది.
అత్యధికంగా 68 వేల 866 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర 161 రూపాయలు పెరిగింది. ఒక బ్యారెల్ ముడి చమురు 5 వేల 693 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 8 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 68 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!