Today Stock Market Roundup 20-03-23: మార్కెట్కి ‘ఉక్రెయిన్’ ఊరట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Stock Market Roundup 20-03-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించింది. మొదటి రోజైన ఇవాళ సోమవారం ఆద్యంతం నెగెటివ్ జోన్లోనే ట్రేడింగ్ జరిగింది. ఉదయం రెండు కీలక సూచీలు నష్టాలతో మొదలై సాయంత్రం కూడా నష్టాలతోనే ముగిశాయి. ఎంపిక చేసిన బ్యాంక్ స్టాక్స్తోపాటు ఎఫ్ఎంసీజీ రంగంలో చివరి నిమిషంలో జరిగిన కొనుగోళ్లు ఇంట్రాడేలో వచ్చిన నష్టాలను కాస్త పూడ్చగలిగాయి.
ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలిపేసే ప్రతిపాదన వార్తలు కూడా బెంచ్మార్క్ ఇండెక్స్లు మెరుగైన ఫలితాలను నమోదుచేయటానికి ఉపయోగపడ్డాయి. క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ అవి పెట్టుబడిదారుల సెంటిమెంట్ని పూర్తిస్థాయిలో పెంచలేకపోయాయి. ఫలితంగా బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఒక శాతం చొప్పున డౌన్ అయ్యాయి. చివరికి.. సెన్సెక్స్.. 360 పాయింట్లు కోల్పోయి 57 వేల 628 పాయింట్ల వద్ద ఎండ్ అయింది.
Also Read
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- Healthy Breakfast Recipe: రోజంతా ఎనర్జీగా ఉండాలంటే ఇదే బెస్ట్ బ్రేక్ఫాస్ట్..! ప్రోటీన్ అధికంగా ఉండే శనగ చాట్ ఇలా ట్రై చేయండి..
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
- Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
read more: India’s First C-295 Aircraft: టాటా, ఎయిర్బస్ కలిసి రూపొందిస్తున్న తొలి సైనిక విమానం
నిఫ్టీ.. 111 పాయింట్లు తగ్గి 16 వేల 988 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లోని మొత్తం 30 కంపెనీల్లో 25 కంపెనీలు లాభాల బాటలో నడవగా 5 కంపెనీలు మాత్రమే లాభాలను ఆర్జించాయి. రాణించినవాటిలో హెచ్యూఎల్, ఐటీసీ, కొటక్ బ్యాంక్, సన్ ఫార్మా, నెస్లే ఇండియా ఉండగా వెనకబడ్డ సంస్థల జాబితాలో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులతోపాటు ఏసియన్ పెయింట్స్, టైటాన్ తదితర కంపెలు ఉన్నాయి.
నిఫ్టీలో హెచ్యూఎల్ మరియు బీపీసీఎల్ షేర్ల విలువలు 2 శాతానికి పైగా పెరిగాయి. బజాజ్ ట్వాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, మెటల్ స్టాక్స్ నేలచూపులు చూశాయి. 10 గ్రాముల బంగారం రేట్ 432 రూపాయలు పెరిగింది. గరిష్టంగా 59 వేల 815 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 596 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 69 వేల 97 రూపాయలు పలికింది.
క్రూడాయిల్ రేట్ 193 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 5 వేల 336 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 2 పైసలు కోల్పోయింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 61 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
iQOO 15T: ఐకూ 15T వచ్చేస్తోంది.. 200MP ప్రధాన కెమెరా, 8000mAh బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లు
-
Mohsin Naqvi: ఐపీఎల్ ఫైనల్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీని బీసీసీఐ ఆహ్వానించిందా? క్లారిటీ ఇదిగో..
-
Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
-
David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ నుంచి క్రేజీ లీక్ వైరల్!
-
Sunil Narine: ఇంకా చాలా మ్యాచ్లు ఆడాలని ఉంది.. ఒక్కసారిగా ఏడ్చేసిన కేకేఆర్ స్టార్ సునీల్ నరైన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..