Today Stock Market Roundup 20-03-23: మార్కెట్కి ‘ఉక్రెయిన్’ ఊరట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Stock Market Roundup 20-03-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించింది. మొదటి రోజైన ఇవాళ సోమవారం ఆద్యంతం నెగెటివ్ జోన్లోనే ట్రేడింగ్ జరిగింది. ఉదయం రెండు కీలక సూచీలు నష్టాలతో మొదలై సాయంత్రం కూడా నష్టాలతోనే ముగిశాయి. ఎంపిక చేసిన బ్యాంక్ స్టాక్స్తోపాటు ఎఫ్ఎంసీజీ రంగంలో చివరి నిమిషంలో జరిగిన కొనుగోళ్లు ఇంట్రాడేలో వచ్చిన నష్టాలను కాస్త పూడ్చగలిగాయి.
ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలిపేసే ప్రతిపాదన వార్తలు కూడా బెంచ్మార్క్ ఇండెక్స్లు మెరుగైన ఫలితాలను నమోదుచేయటానికి ఉపయోగపడ్డాయి. క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ అవి పెట్టుబడిదారుల సెంటిమెంట్ని పూర్తిస్థాయిలో పెంచలేకపోయాయి. ఫలితంగా బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఒక శాతం చొప్పున డౌన్ అయ్యాయి. చివరికి.. సెన్సెక్స్.. 360 పాయింట్లు కోల్పోయి 57 వేల 628 పాయింట్ల వద్ద ఎండ్ అయింది.
Also Read
- Iran-US Ceasefire: గుడ్న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
- Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
- WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్కు డబుల్ ప్రొటెక్షన్!
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
read more: India’s First C-295 Aircraft: టాటా, ఎయిర్బస్ కలిసి రూపొందిస్తున్న తొలి సైనిక విమానం
నిఫ్టీ.. 111 పాయింట్లు తగ్గి 16 వేల 988 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లోని మొత్తం 30 కంపెనీల్లో 25 కంపెనీలు లాభాల బాటలో నడవగా 5 కంపెనీలు మాత్రమే లాభాలను ఆర్జించాయి. రాణించినవాటిలో హెచ్యూఎల్, ఐటీసీ, కొటక్ బ్యాంక్, సన్ ఫార్మా, నెస్లే ఇండియా ఉండగా వెనకబడ్డ సంస్థల జాబితాలో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులతోపాటు ఏసియన్ పెయింట్స్, టైటాన్ తదితర కంపెలు ఉన్నాయి.
నిఫ్టీలో హెచ్యూఎల్ మరియు బీపీసీఎల్ షేర్ల విలువలు 2 శాతానికి పైగా పెరిగాయి. బజాజ్ ట్వాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, మెటల్ స్టాక్స్ నేలచూపులు చూశాయి. 10 గ్రాముల బంగారం రేట్ 432 రూపాయలు పెరిగింది. గరిష్టంగా 59 వేల 815 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 596 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 69 వేల 97 రూపాయలు పలికింది.
క్రూడాయిల్ రేట్ 193 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 5 వేల 336 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 2 పైసలు కోల్పోయింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 61 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!