IT Tower: నేడే నిజామాబాద్ ఐటీ హాబ్ ప్రారంభోత్సవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్రం ఐటీ రంగంలో దూసుకెళ్తోంది. మొన్నటి దాకా ఐటీ సెక్టార్ అంటే కేవలం హైదరాబాద్ పేరు మాత్రమే వినిపించేది. కానీ ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు విస్తరించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఐటీ టవర్స్ ను ఏర్పాటు చేసి.. స్థానిక యువతకు ఉద్యోగాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాల్లో ఐటీ హబ్ లను ఏర్పాటు చేసింది. తాజాగా నిజామాబాద్ లోనూ ఐటీ టవర్ ను ఏర్పాటు చేసింది.
Read Also: Suryakumar Yadav: చెలరేగిన సూర్యకుమార్, మెరిసిన తిలక్.. మూడో టీ20లో భారత్ ఘన విజయం!
Also Read
- El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అప్రమత్తం.. భయాందోళన అక్కర్లేదని హామీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
- TMC Crisis: మమతకు భారీ షాక్.. 60 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు..!
- Monkey Control Tips: కోతులు ఇబ్బంది పెడుతున్నాయా..? శాశ్వతంగా తరిమికొట్టే అద్భుతమైన చిట్కాలు
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు నిజామాబాద్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐటీ టవర్ తో పాటు న్యాక్, మున్సిపల్ భవనాలను ఆయన ప్రారభించనున్నారు. మినీ ట్యాక్ బండ్, వైకుంఠ దామాలను ప్రారంభిస్తారు. పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తుండటంతో.. నిజామాబాద్ పట్టణాన్ని పార్టీ శ్రేణులు గులాబీమయంగా మార్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో.. మంత్రి కేటీఆర్ పర్యటనకు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ దగ్గర ఏర్పాటు చేసిన ఐటీ టవర్స్ ను మంత్రి జిల్లా ప్రజలకు అంకితం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 కోట్లతో ఐటీ టవర్ ను నిర్మించింది.
Read Also: Vishnu Stotram: అప్పుల బాధలు తక్షణమే పోవాలంటే ఇంట్లో ఈ స్తోత్రాలు వినండి
అయితే, దాదాపు 750 మంది ఉద్యోగులకు ప్రత్యక్షంగా 4వేల మందికి పరోక్షంగా ఉపాది కల్పించేలా ఈ ఐటీ టవర్స్ సిద్దం చేసినట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే 15 సంస్థలతో ఒప్పందం పూర్తి చేసి.. 280 మంది ఉద్యోగులను నియామకం చేశారు. నిజామాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ ఐదు గంటల పాటు ఉండనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలిక్యాప్టర్ లో నూతన కలెక్టరేట్ సముదాయంలోని హెలిప్యాడ్ లో ల్యాండ్ అవుతారు. అక్కడ నుంచి నేరుగా ఐటీ టవర్ ప్రారంభించి.. ఉద్యోగులతో కాసేపు మాట్లాడి.. అక్కడి నుంచి వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించి.. పాలిటెక్నిక్ మైదానంలో జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు.
తాజావార్తలు
-
El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అప్రమత్తం.. భయాందోళన అక్కర్లేదని హామీ
-
Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
-
TMC Crisis: మమతకు భారీ షాక్.. 60 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Jagapathi Babu: ఒకప్పటి స్టార్ హీరో.. రోడ్డుపై అంతలా తిరిగినా ఎవరూ గుర్తుపట్టలేదు? వైరల్ అవుతున్న వీడియో!
ట్రెండింగ్
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!