Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Today Business Headlines 15 03 23 Wife Of Zoho Ceo Sridhar Vembu Accuses Him Of Fraud

Today Business Headlines 15-03-23: ‘మా ఆయన బంగారం’ కాదు.. తొండి. మరిన్ని వార్తలు

Published Date :March 15, 2023 , 12:34 pm
By Akkirala Kondala Rao
Today Business Headlines 15-03-23: ‘మా ఆయన బంగారం’ కాదు.. తొండి. మరిన్ని వార్తలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Today Business Headlines 15-03-23:

లక్షకుపైగా కంపెనీలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి లక్షకు పైగానే కంపెనీలు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో లక్షా 13 వేల సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది జనవరి నాటికి తెలంగాణలో 86 వేల 704 కంపెనీలు, ఏపీలో 26 వేల 437 సంస్థలు ఉన్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో 42 వేల 646 కంపెనీలు ఉండగా మూసివేసినవాటిని మరియు రద్దయ్యే క్రమంలో ఉన్న వాటిని తీసేస్తే నికరంగా 26 వేల 437 మాత్రమే తేలాయి.

రైతులకు అగ్రి లోన్లు

గ్రామాల్లో రైతులకు రుణాలు ఇచ్చేందుకు యాక్సిస్‌ బ్యాంక్‌.. ఐటీసీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో.. ఐటీసీ సంస్థలోని అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ కోసం ప్రత్యేకంగా పంటలు పండించే కర్షకులకు ఈజీగా లోన్లు ఇవ్వనున్నారు. వ్యవసాయ రుణాలు, బంగారంపై రుణాలు మంజూరు చేయనున్నారు. ఈ మేరకు అగ్రి-టెక్‌ అప్లికేషన్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ విషయాలను యాక్సిస్‌ బ్యాంక్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ మనీశ్‌ సర్దా వెల్లడించారు.

మరో 10 వేల మంది

మెటా సంస్థ 4 నెలల వ్యవధిలో మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించనుంది. నవంబర్‌లో 11 వేల మందిని తీసేసిన ఈ కంపెనీ రానున్న 2 నెలల్లో 10 వేల మందికి లేఆఫ్‌ ఇవ్వనుంది. ఇంకో 5 వేల వేకెన్సీలను భర్తీ చేయకూడదని కూడా నిర్ణయం తీసుకుంది. వ్యాపార పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవని, అందుకే కంపెనీ ఆర్థిక స్థితిగతులను రక్షించుకోవటానికి ఖర్చులను తగ్గించుకుంటున్నామని చెబుతోంది. ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టా సంస్థలకు మెటా.. పేరెంట్‌ కంపెనీ అనే సంగతి తెలిసిందే.

సీసీఐ గ్రీన్‌సిగ్నల్‌

రిలయెన్స్ రిటైల్‌ సంస్థలో మెట్రో క్యాష్ అండ్ క్యారీ కంపెనీ విలీనానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్‌ ఇండియా.. CCI.. ఆమోదం తెలిపింది. ఈ రెండు సంస్థలు విలీనమవుతున్నాయనే ప్రకటన డిసెంబర్‌లో వెలువడింది. ఈ డీల్‌ విలువ 2 వేల 850 కోట్ల రూపాయలు. జర్మనీకి చెందిన మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీకి మన దేశంలో 30 లక్షల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. ఇందులో 10 లక్షల మంది తరచుగా కొనుగోళ్లు చేసేవారే కావటం చెప్పుకోదగ్గ విషయం. మెట్రోకి 21 సిటీల్లో 31 స్టోర్లు ఉన్నాయి.

వివాదంలో.. జోహో

జోహో కంపెనీ కోఫౌండర్‌ అండ్‌ CEO శ్రీధర్ వెంబు కుటుంబ గొడవలు రచ్చకెక్కాయి. శ్రీధర్ తనను మోసం చేయటానికి ప్రయత్నిస్తున్నారని ఆయన భార్య ప్రమీలా శ్రీనివాసన్‌ ఆరోపించారు. తనను, తన కుమారుణ్ని రెండేళ్ల కిందట వదలిపెట్టారని తెలిపారు. సంస్థలోని ఉమ్మడి షేర్లను తనకు తెలియకుండా బదిలీ చేశారని తప్పుపట్టారు. ఈ మేరకు అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టులో జనవరిలోనే వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వివాదానికి అసలు కారణం తన మామేనని శ్రీధర్‌ అన్నారు.

వినియోగదారుల దినం

ఇవాళ మార్చి 15వ తేదీ. ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది తొలిసారిగా 1983లో ప్రారంభమైంది. కస్టమర్లకు ఎలాంటి హక్కులు, అవసరాలు ఉంటాయి?. వాటిని ఎలా సాధించుకోవాలి, ఎలా రక్షించుకోవాలి? సంస్థల చేతిలో మోసపోయినప్పుడు న్యాయం పొందే విధానమేంటి? అనే అంశాలపై అవగాహన కల్పించటం కోసమే ఈ రోజును కేటాయించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నెడీని దీనికి ఇన్‌స్పిరేషన్‌గా చెప్పుకోవచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • active companies
  • agri loans
  • axis bank
  • CCI green signal
  • meta fresh layoffs

తాజావార్తలు

  • Asha Bhosle: 10 ఏళ్ల కెరీర్, 16 ఏళ్లకే పెళ్లి.. ఆశాభోస్లే జీవితం అంత ఈజీ కాదు..

  • Asha Bhosle Telugu Songs: ‘నాలో ఊహలకు’.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆశా భోస్లే పాటలు విన్నారా..?

  • Gopichand33: మ్యాచో స్టార్ గోపీచంద్ 33వ సినిమా అప్‌డేట్..

  • PM Modi: ఏకమవ్వాలి.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ ఎంపీలకు ప్రధాని మోడీ లేఖ

  • Asha Bhosle : మూగబోయిన గాన గంధర్వం.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions