Today (13-01-23) Stock Market Roundup: ముగిసింది వారం.. మురిసింది వ్యాపారం..
Today (13-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ వ్యాపారం ఎట్టకేలకు మురిసింది. ఈ వారాంతాన్ని లాభాలతో ముగించింది. ఇవాళ శుక్రవారం ఉదయం కూడా నష్టాలతోనే ప్రారంభమైన సూచీలు.. మొత్తానికి.. ఇంట్రాడేలో కోలుకొని.. చివరికి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ ఒకానొక దశలో 59 వేల 628 పాయింట్లకు పడిపోయి.. మళ్లీ.. 60 వేల 418 పాయింట్లకు ర్యాలీ తీసింది. నిఫ్టీ కూడా తిరిగి 18 వేల పాయింట్ల బెంచ్ మార్క్ను చేరుకుంది.
ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, హెచ్యూఎల్, టాటా స్టీల్ స్టాక్స్ ఒక శాతానికి పైగా లాభపడటం కలిసొచ్చింది. ఇండియా మరియు అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ను పెంచాయి. సెన్సెక్స్ 303 పాయింట్లు లాభపడి 60 వేల 261 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 17 వేల 956 పాయింట్ల వద్ద ముగిసింది. 18 వేల బెంచ్ మార్క్ను చేరుకోలేకపోయింది.
Also Read
- AC Health Risks: గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా..? ఈ వ్యాధులకు కారణం కావచ్చు..! ఏం చేయాలి..
- Top Selling CNG Cars: భారత్లో అత్యధికంగా సేల్ అయిన CNG కార్లు ఇవే..
- Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!
- SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
read more: Non-Tech Sector Hiring: పెరగనున్న వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు
సెన్సెక్స్లోని మొత్తం 30 కంపెనీల్లో 21 కంపెనీలు లాభాల బాటలో నడిచాయి. ఇండస్ ఇండ్, మారుతి, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యూనీలీవర్, ఎస్బీఐ షేర్లు బాగా రాణించాయి. మిడ్క్యాప్ ఇండెక్స్ సున్నా పాయింట్ ఒక శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ సున్నా పాయింట్ 3 శాతం పెరిగాయి. ఎల్టీటీఈస్, జీఈ షిప్పింగ్, బాటా ఇండియా బాగా వెనకబడ్డాయి.
నిఫ్టీలో మెటల్ మరియు పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్లు ఉత్తమ పనితీరు కనబరిచాయి. లాభపడ్డ సంస్థల్లో అదానీ ఎంటర్ప్రైజెస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటర్స్ టాప్లో నిలిచాయి. టైటాన్, ఎస్బీఐ లైఫ్, అపోలో హాస్పిటల్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. సెక్టార్ల వారీగా చూస్తే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ట్రేడింగ్లో దూసుకుపోయాయి. కెనరా బ్యాంక్ స్టాక్స్ 2 శాతానికి పైగా లాభపడ్డాయి.
వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే ఇండియా వీఐఎక్స్ షేర్లు 4 శాతానికి పైగా బోల్తా కొట్టాయి. టైటాన్ కంపెనీ షేర్ల విలువ కూడా 2 శాతం తగ్గి 4 నెలల కనిష్టానికి పడిపోయింది. 52 వారాల గరిష్టం నుంచి 14 శాతం పతనమయ్యాయి. 10 గ్రాముల బంగారం ధర 245 రూపాయలు పెరిగి గరిష్టంగా 56 వేల 120 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు స్వల్పంగా 46 రూపాయలు నష్టపోయి అత్యధికంగా 68 వేల 597 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర 25 రూపాయలు పెరిగి ఒక బ్యారెల్ చమురు 6 వేల 416 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 16 పైసలు తగ్గింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 81 రూపాయల 41 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
TGSRTC: రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్.. చెప్పుతో దాడి చేసిన కండక్టర్, ప్రయాణికులు
-
Bhuvneshwar Kumar Record: దూసుకెళ్తున్న స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్.. జస్ప్రీత్ బుమ్రా రికార్డు బ్రేక్!
-
AC Health Risks: గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా..? ఈ వ్యాధులకు కారణం కావచ్చు..! ఏం చేయాలి..
-
Top Selling CNG Cars: భారత్లో అత్యధికంగా సేల్ అయిన CNG కార్లు ఇవే..
-
IPL 2026 Playoffs Chances: రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేస్.. గుజరాత్కు చిగురించిన ఆశలు, ఆ 5 టీమ్స్ ఇక ఇంటికేనా?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!