Today (13-01-23) Stock Market Roundup: ముగిసింది వారం.. మురిసింది వ్యాపారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today (13-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ వ్యాపారం ఎట్టకేలకు మురిసింది. ఈ వారాంతాన్ని లాభాలతో ముగించింది. ఇవాళ శుక్రవారం ఉదయం కూడా నష్టాలతోనే ప్రారంభమైన సూచీలు.. మొత్తానికి.. ఇంట్రాడేలో కోలుకొని.. చివరికి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ ఒకానొక దశలో 59 వేల 628 పాయింట్లకు పడిపోయి.. మళ్లీ.. 60 వేల 418 పాయింట్లకు ర్యాలీ తీసింది. నిఫ్టీ కూడా తిరిగి 18 వేల పాయింట్ల బెంచ్ మార్క్ను చేరుకుంది.
ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, హెచ్యూఎల్, టాటా స్టీల్ స్టాక్స్ ఒక శాతానికి పైగా లాభపడటం కలిసొచ్చింది. ఇండియా మరియు అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ను పెంచాయి. సెన్సెక్స్ 303 పాయింట్లు లాభపడి 60 వేల 261 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 17 వేల 956 పాయింట్ల వద్ద ముగిసింది. 18 వేల బెంచ్ మార్క్ను చేరుకోలేకపోయింది.
Also Read
- China Caste System: చైనాలో కుల వ్యవస్థ?.. కమ్యూనిజం వెనుక దాగిన చీకటి కోణం బట్టబయలు..
- 144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
- Touching Elders Feet: పెద్దల కాళ్లకు నమస్కారం చేయడం.. కేవలం సంప్రదాయమేనా.! శాస్త్రీయ కోణం కూడా ఉందా.?
- Anupama Singh: "మీరు పెంచిన భూతమే మిమ్మల్ని కాటేసింది".. ఐరాసలో పాకిస్థాన్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
read more: Non-Tech Sector Hiring: పెరగనున్న వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు
సెన్సెక్స్లోని మొత్తం 30 కంపెనీల్లో 21 కంపెనీలు లాభాల బాటలో నడిచాయి. ఇండస్ ఇండ్, మారుతి, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యూనీలీవర్, ఎస్బీఐ షేర్లు బాగా రాణించాయి. మిడ్క్యాప్ ఇండెక్స్ సున్నా పాయింట్ ఒక శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ సున్నా పాయింట్ 3 శాతం పెరిగాయి. ఎల్టీటీఈస్, జీఈ షిప్పింగ్, బాటా ఇండియా బాగా వెనకబడ్డాయి.
నిఫ్టీలో మెటల్ మరియు పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్లు ఉత్తమ పనితీరు కనబరిచాయి. లాభపడ్డ సంస్థల్లో అదానీ ఎంటర్ప్రైజెస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటర్స్ టాప్లో నిలిచాయి. టైటాన్, ఎస్బీఐ లైఫ్, అపోలో హాస్పిటల్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. సెక్టార్ల వారీగా చూస్తే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ట్రేడింగ్లో దూసుకుపోయాయి. కెనరా బ్యాంక్ స్టాక్స్ 2 శాతానికి పైగా లాభపడ్డాయి.
వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే ఇండియా వీఐఎక్స్ షేర్లు 4 శాతానికి పైగా బోల్తా కొట్టాయి. టైటాన్ కంపెనీ షేర్ల విలువ కూడా 2 శాతం తగ్గి 4 నెలల కనిష్టానికి పడిపోయింది. 52 వారాల గరిష్టం నుంచి 14 శాతం పతనమయ్యాయి. 10 గ్రాముల బంగారం ధర 245 రూపాయలు పెరిగి గరిష్టంగా 56 వేల 120 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు స్వల్పంగా 46 రూపాయలు నష్టపోయి అత్యధికంగా 68 వేల 597 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర 25 రూపాయలు పెరిగి ఒక బ్యారెల్ చమురు 6 వేల 416 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 16 పైసలు తగ్గింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 81 రూపాయల 41 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
China Caste System: చైనాలో కుల వ్యవస్థ?.. కమ్యూనిజం వెనుక దాగిన చీకటి కోణం బట్టబయలు..
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
IVF SCAM: కన్నబడ్డలే కానివాళ్లైతే…! IVF ముసుగులో ఇంత దారుణమా
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Touching Elders Feet: పెద్దల కాళ్లకు నమస్కారం చేయడం.. కేవలం సంప్రదాయమేనా.! శాస్త్రీయ కోణం కూడా ఉందా.?
ట్రెండింగ్
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!
-
Sreesanth Challenges Harbhajan: “దమ్ముంటే రింగ్లోకి రా.!” హర్భజన్ సింగ్కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!