Mahua Moitra : త్వరగా బంగ్లా ఖాళీ చేయండి.. టీఎంసీ నేత మహువా మొయిత్రాకు అల్టిమేటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra : టీఎంసీ నేత మహువా మొయిత్రా ఇటీవల పార్లమెంట్ నుంచి బహిష్కరించబడిన సంగతి తెలిసిందే. ఇప్పడు ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయనందుకు అల్టిమేటం అందుకున్నారు. ఈ మేరకు ఆమె మరో నోటీసు అందుకుంది. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయకుంటే తనను బలవంతంగా బంగ్లాను ఖాళీ చేయిస్తామని ఆ నోటీసులో పేర్కొన్నారు. పార్లమెంటు నుండి సస్పెన్షన్ తర్వాత, మహువా మొయిత్రా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయమని అనేక నోటీసులు అందుకున్నారు. ఇంత జరుగుతున్నా ఆమె ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయడం లేదు. నోటీసు ప్రకారం, ఆమె పార్లమెంటు సభ్యత్వం కోల్పోయిన తర్వాత, ఈ బంగ్లాకు అర్హురాలు కాదు. అందువల్ల ఆమె 9B టెలిగ్రాఫ్ లేన్లోని టైప్ 5 బంగ్లాను ఖాళీ చేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం బంగ్లాను ఖాళీ చేసేందుకు నెల రోజుల గడువు ఇచ్చారు. అయితే ఈలోగా కోర్టును కూడా ఆశ్రయించినా అక్కడి నుంచి కూడా ఉపశమనం లభించలేదు.
Read Also:Delhi : ఢిల్లీలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. పొగమంచు కారణంగా 53 విమానాలు రద్దు..
Also Read
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
- EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
మహువా ప్రభుత్వ బంగ్లాను వెంటనే ఖాళీ చేయాలని నోటీసులో పేర్కొన్నారు. సభ్యత్వం కోసం ఒక నెల గడువు ముగిసిన తర్వాత జనవరి 7న అలాట్మెంట్ రద్దు చేయబడింది. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని మహువా మొయిత్రాకు పలుమార్లు నోటీసులు అందాయి. అదే సమయంలో ఇప్పుడు బంగ్లాను ఖాళీ చేయకుంటే అవసరమైతే బలవంతంగా గెంటేస్తామని తాజా నోటీసులో పేర్కొన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ ఆమెకు ఈ నోటీసు పంపింది.
Read Also:Power Cuts in Hyderabad: హైదరాబాద్ లో విద్యుత్ కోతలు.. నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు..!
ప్రభుత్వ బంగ్లాను ఎప్పుడు ఖాళీ చేయాలి?
ఎంపీగా ఎన్నికైన తర్వాత టీఎంసీ నేత మహువా మొయిత్రా టెలిగ్రాఫ్ లేన్లో ప్రభుత్వ బంగ్లాను పొందారు. చట్టం ప్రకారం, ఎంపీలు పార్లమెంటు సభ్యత్వాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక నెల మాత్రమే ప్రభుత్వ నివాసాన్ని ఉంచుకోవచ్చు. దీని తర్వాత వారు బంగ్లాను ఖాళీ చేయాలి. సవరించిన చట్టం ప్రకారం, ప్రభుత్వ వసతి గృహాల నుండి అనధికార వ్యక్తులను తొలగించడానికి 3 రోజుల ముందు ఎస్టేట్ అధికారి షోకాజ్ నోటీసు జారీ చేయవచ్చు. ఇంతకుముందు ఈ వ్యవధి 60 రోజులు. పార్లమెంటులో ప్రశ్నలు అడిగినందుకు డబ్బు తీసుకున్నందుకు దోషిగా తేలడంతో మహువా మొయిత్రా పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు.
తాజావార్తలు
-
University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
-
Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
-
EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
-
Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!