Sandeshkhali Case: సందేశ్ఖాలీ కేసులో కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సందేశ్ఖాలీ కేసులో హైకోర్టు సీరియస్ అయింది. పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని సందేశ్ఖాలీ (Sandeshkhali) కేసులో రాష్ట్ర పోలీసులకు కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేత షాజహాన్ షేక్ (Sheikh Shajahan)ను అరెస్ట్ చేసి తీరాల్సిందేనని పోలీసులకు న్యాయస్థానం ఆదేశించింది.
మహిళలపై గూండాలు లైంగిక వేధింపులు పాల్పడ్డారని, వారి భూములను ఆక్రమించారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేత షాజహాన్ షేక్ (Sheikh Shajahan)ను అరెస్టు చేయకూడదని తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని.. తక్షణమే అతడిని అరెస్ట్ చేసి తీరాల్సిందేనని పోలీసులకు సూచించింది.
Also Read
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
- Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ల పెళ్లి తేదీ ఫిక్స్..!
సందేశ్ఖాలీ ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సందేశ్ఖాలీ కేసులో పోలీసుల చేతులను కోర్టు కట్టేసిందన్నారు. అందుకే షాజహాన్ను అరెస్టు చేయలేకపోతున్నామని తెలిపారు.
సోమవారం ఈ కేసు కలకత్తా హైకోర్టులో విచారణకు రాగా అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలను అమికస్ క్యూరీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అరెస్టు నిలుపుదల చేశారా? లేదా అన్నదానిపై స్పష్టతనివ్వాలని కోరారు.
దీనికి కోర్టు స్పందిస్తూ.. మేం అరెస్టుపై ఎలాంటి స్టే విధించలేదని. ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపింది. నిందితుడి షాజహాన్ను అరెస్టు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. సందేశ్ఖాలీ వ్యవహారాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.
ఈ నేపథ్యంలో షాజహాన్ షేక్, ఈడీ, సీబీఐ, రాష్ట్ర హోం సెక్రటరీని పార్టీలుగా ఇంప్లీడ్ చేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. దీనిపై వార్తాపత్రికల్లో పబ్లిక్ నోటీసు ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అతడిపై న్యాయపరమైన చర్యలు చేపట్టినట్లు ఆ నోటీసుల్లో పేర్కొనాలని సూచించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది.
సందేశ్ఖాలీ ఘటనపై గత కొద్ది రోజులుగా పశ్చిమబెంగాల్ అట్టుడుకుతోంది. మహిళల ఆందోళనలకు బీజేపీ మద్దతు తెలిపింది. ఈ ఆందోళనల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా గాయాలపాలయ్యారు. మరోవైపు వచ్చే నెల ఫస్ట్వీక్లో ప్రధాని మోడీ పశ్చిమబెంగాల్లో పర్యటిస్తు్న్నారు. ఈ పర్యటనలో సందేశ్ఖాలీ బాధితులను మోడీ పరామర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
#CORRECTION | The Calcutta High Court Chief Justice ordered to add Sheikh Shahjahan to the Sandeshkhali case; says – Public notice shall be given in this case. There is no stay order in Sandeshkhali cases. There is no reason to not arrest him. pic.twitter.com/ABvAU6N1uf
— ANI (@ANI) February 26, 2024
తాజావార్తలు
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్పాల్ యాదవ్పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!