Road Accident: నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్వేలు జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కొడవలూరు మండలం దామేగుంట గ్రామానికి చెందిన రెండు కుటుంబాలకు చెందిన వారు చెన్నైకి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నిమిషానికి పదుల సంఖ్యలో వాహనాలు తిరిగే జాతీయ రహదారి మీద కాలకృత్యాల కోసం నిబంధనలకు విరుద్ధంగా ట్రక్ ఆపాడు డ్రైవర్.
Read Also: TS EAMCET Results 2023: ఎంసెట్ ఫలితాలు విడుదల.. https://ntvtelugu.com లో చెక్ చేసుకోండి
అది గమంచని ఇన్నోవా డ్రైవర్ ఆగివున్న ట్రక్కును వెనుక నుంచి వేగంగా ఢీ కొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స కోసం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.