NTV Telugu Site icon

Tragedy: విషాదంగా మారిన విహారయాత్ర.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Vihara Yatra

Vihara Yatra

విహారయాత్ర కాస్తా విషాదంగా మారింది. విహారయాత్రకు వెళ్లి ఎంజాయ్ చేద్దామని వెళ్లిన యువకులు శవాలుగా తిరిగొచ్చారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్యనే శ్రీశైలం జలాశయం గేట్లు అధికారులు తెరిసిన విషయం తెలిసిందే.. అది చూసేందుకు ఎక్కడెక్కడో పర్యాటకులు తరలివస్తున్నారు. గత నాలుగురోజులుగా పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ఇదే క్రమంలో.. తాము కూడా ఆ అందాలను చూసేందుకని వెళ్లారు. కానీ.. మళ్లీ తిరగ రాలేదు. ఈరోజు ఆదివారం కావడంతో పర్యాటకుల సందర్శన మరింత ఎక్కువైంది. దీంతో.. ఎక్కడికక్కడా ట్రాఫిక్ నిలిచిపోయింది.

Read Also: Love Jihad: “లవ్ జిహాద్‌”కి పాల్పడితే జీవిత ఖైదు.. కొత్త చట్టం తెస్తామన్న హిమంత..

ఇదిలా ఉంటే.. శ్రీశైలం వెళ్లడం వరకైతే బాగానే వెళ్లారు. అక్కడ కృష్ణమ్మ పరవళ్లు చూసి ఎంజాయ్ చేసిన స్నేహితులు, తిరిగి పయనమయ్యారు. అయితే.. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూరు సమీపంలో అదుపుతప్పిన కారు చెట్టుకు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో మచ్చ బొల్లారంకి చెందిన కన్నయ్య (22) ఉన్నాడు. మరో ఇద్దరు కొంపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కన్నయ్య అనే వ్యక్తి కారులోనే విహారయాత్రకు వెళ్లినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also: Mossad: మొసాద్ డెడ్లీ ఆపరేషన్స్.. మ్యూనిచ్ ఊచకోతకు కారణమైన ప్రతీ ఉగ్రవాదిని వెంటాడి లేపేసింది..