Site icon NTV Telugu

Bengaluru: టెక్‌ కంపెనీ సీఈవో, ఎండీ హత్య కేసు.. దారుణంగా హతమార్చిన ముగ్గురు అరెస్ట్‌

Bengaluru

Bengaluru

Bengaluru: బెంగళూరులో మంగళవారం జరిగిన జంట హత్యల కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల జంట హత్యలు జరిగిన ఒక రోజు తర్వాత, ప్రధాన నిందితులు సహా ముగ్గురిని బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Bengaluru: టెక్ కంపెనీ సీఈఓ, ఎండీని పొడిచి చంపిన మాజీ ఉద్యోగి..

ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ అరోనిక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) హత్యకేసులో ప్రమేయం ఉన్న ముగ్గురిని అమృతహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నివాస ప్రాంతమైన అమృతహళ్లి సమీపంలోని పంపా ఎక్స్‌టెన్షన్‌లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు వ్యక్తులను ప్రధాన నిందితులు శబరీష్ అలియాస్ ఫెలిక్స్ (27), వినయ్ రెడ్డి (23), సంతోష్ అలియాస్ సంతు (26)లుగా గుర్తించారు. నిందితులు ఏరోనిక్స్ కార్యాలయంలోకి చొరబడి కంపెనీ సీఈవో వేణుకుమార్ (40), ఎండీ ఫణీంద్ర సుబ్రమణ్యం (36)లను హత్య చేశారు.

Also Read: Secret Camera: గదిలో రహస్యంగా కెమెరాలు.. యువతులు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు రికార్డ్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక మాజీ ఉద్యోగి తన ఇద్దరు సహచరులతో కలిసి క్యాబిన్‌లోకి చొరబడి కత్తితో దాడి చేసి ఇద్దరిని హత్యచేశాడు. హత్య వార్త ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఈ జంట హత్యలో ప్రధాన నిందితుడిని ఏరోనిక్స్ మాజీ ఉద్యోగి ఫెలిక్స్‌గా గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Exit mobile version