Actress Sridevi: శ్రీదేవి మరణంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సినీ రచయిత
- రచయిత తోటపల్లి మధు
- శ్రీదేవి మరణంపై ఘాటు వ్యాఖ్యలు
- ప్రతిరోజు మందు తాగేదంటూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Sridevi: అతిలోక సుందరి హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ్, హిందీ.. ఇలా భాష ఏదైనా సరే, తన నటనతో ప్రేక్షకులను మెప్పించే హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది శ్రీదేవి. బాలీవుడ్ లో కూడా ఆమె ప్రస్థానం తారాస్థాయికి చేరింది. సినిమా ఇండస్ట్రీలో తొలిసారిగా లేడీ సూపర్ స్టార్ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్గా శ్రీదేవి రికార్డు సృష్టించింది. అందం, అభినయం, నటన, చలాకితనం ఇలా అన్ని కలగలిపి ఉండే వ్యక్తిగా శ్రీదేవి పేరుగాంచింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదలైన ఆమె ప్రస్థానం బాలీవుడ్ లో అగ్రస్థాయి హీరోయిన్గా చేరింది. ఇకపోతే, ఈ అందాల నటి దూరమై ఆరు సంవత్సరాలు అవుతోంది. శ్రీదేవి చనిపోవడం అభిమానులకు తీరని లోటు. ఇదిలా ఉండగా, ఓ టాలీవుడ్ రచయిత ఆమె మరణంపై నోరు పారేసుకున్నట్లుగా అనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Also Read: Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్లో కుర్రాళ్ల మతిపోగొట్టిన నేషనల్ క్రష్
Also Read
- Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ '45' స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
శ్రీదేవి వ్యక్తిత్వాని కించపరిచేలా సినీ ప్రముఖుడు తోటపల్లి మధు కొన్ని కీలక వ్యాఖ్యలను ఓ ఇంటర్వ్యూలో చేశారు. ఇందులో భాగంగా శ్రీదేవి ప్రతిరోజు తాగుతుండేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమా అనేది రంగుల ప్రపంచమని, ఒక్కసారి మేకప్ చేసుకుంటే అందులో నుండి బయటకు రావడం కష్టమంటూ.. అలాంటి వారిలో శ్రీదేవి ఒకరిని తెలిపారు. అంతేకాకుండా, 55 సంవత్సరాల వయసులో అనారోగ్య కారణంగా ఆవిడ మరణించిందని.. ఆవిడకు డయాబెటిస్, హైబిపి లాంటి అనారోగ్య సమస్యలతో బాధపడిందని తెలియజేశాడు. అలాగే శ్రీదేవి అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని, ఇంకా డైట్ అంటూ ఆమె తక్కువుగా తినేది అంటూ తెలిపాడు. అయితే, ఆవిడ మంచి డ్రింకర్ అని ప్రతిరోజు తాగేదంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో దుమారాన్ని లేపుతున్నాయి. ముఖ్యంగా శ్రీదేవి అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు. చనిపోయిన ఆవిడ పై ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు అవసరమా అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.
Also Read: Amaran Movie Meets Rajnath Singh: కేంద్రమంత్రిని కలిసిన అమరన్ మూవీ టీమ్.. అభినందల వెల్లువ
తాజావార్తలు
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
-
RAPO23 : కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత : రామ్ పోతినేని
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!