Kulwinder Kaur : కంగనాను కొట్టిన కుల్విందర్ కౌర్కు గోల్డ్ రింగ్.. పంపనున్న టీపీడీకే
- కంగనాను చెంపదెబ్బ కొట్టిన కుల్విందర్ కౌర్
- రోజు రోజుకు ఆమెకు పెరుగుతున్న మద్దతు
- బంగారపు ఉంగరాన్ని పంపనున్న టీపీడీకే పార్టీ
- కౌర్ ను సన్మానించనున్న రైతు సంఘాలు
Kulwinder Kaur : హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీ, నటి కంగనా రనౌత్ను చండీగఢ్ ఎయిర్ పోర్టులో చెప్పుతో కొట్టిన సీఐఎస్ఎఫ్ జవాన్ కుల్విందర్ కౌర్కు మద్దతు పెరుగుతోంది. కొందరు మాత్రం కుల్విందర్ కౌర్ను విమర్శిస్తున్నారు. అయితే కుల్విందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తరువాత ఆమెను విడుదల చేయాలని ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు తంథై పెరియార్ ద్రవిడర్ కజగం (టిపిడికె) పార్టీ కుల్విందర్ కౌర్కు బంగారు ఉంగరాన్ని(గోల్డ్ రింగ్) పంపాలని నిర్ణయించింది. ఈ ఉంగరానికి పెరియార్ ఫోటో కూడా జతచేయనున్నారు.
Read Also:Ram Mohan Naidu: భోగాపురం ఎయిర్పోర్టును జెట్ స్పీడ్లో పూర్తి చేస్తా..
Also Read
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
- Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
- West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
- Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
ఎనిమిది గ్రాముల బంగారు ఉంగరాన్ని పంపాలని యోచిస్తున్నామని టీపీడీకే ప్రధాన కార్యదర్శి కేయూ రామకృష్ణన్ శనివారం తెలిపారు. రైతుల కోసం నిర్భయంగా నిలబడిన మహిళకు తగిన గౌరవం దక్కాలన్నారు. నిరసనలో కూర్చున్న రైతులపై కంగనా అవమానకరమైన పదాలను ఉపయోగించిందని.. చెంపదెబ్బ కొట్టిన తర్వాత కుల్విందర్ కౌర్ పేర్కొన్నారు. కుల్విందర్ తల్లి కూడా ఆ సమ్మెలో పాల్గొన్నారు. కుల్విందర్ కౌర్ ఇంటి చిరునామాకు ఉంగరాన్ని పంపుతామని రామకృష్ణన్ తెలిపారు. ఆమె కొరియర్ని అంగీకరించకపోతే, మేము మా సభ్యులలో ఒకరిని ఆమె ఇంటికి పంపుతామన్నారు. మా సభ్యులతో ఒకరు రైలులో లేదా విమానంలో తన ఇంటికి వెళతారు. పెరియార్ పుస్తకాలను కూడా ఆమెకు బహుమతిగా అందిస్తామని తెలిపారు. ఆదివారం మొహాలీలో సిఐఎస్ఎఫ్కి మద్దతుగా ర్యాలీ కూడా జరిగింది. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి కౌర్పై ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. మొహాలీ పోలీసులు ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ను ఏర్పాటు చేశారు. సిటీ ఎస్పీ హర్బీర్ సింగ్ అత్వాల్ నేతృత్వంలో ఈ బృందం దర్యాప్తు చేస్తుంది.
Read Also:Darshan Arrest: హత్య కేసు.. ప్రముఖ కన్నడ నటుడు అరెస్ట్!
సీఐఎస్ఎఫ్ జవాన్ కుల్విందర్ కౌర్ కోపంతో కంగనాను కొట్టి ఉండవచ్చని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం అన్నారు. చాలా మంది కుల్విందర్ కౌర్ను ధైర్యవంతురాలు, వీర వనిత అని పిలుస్తున్నారు. పంజాబ్లోని కొన్ని చోట్ల కుల్విందర్ కౌర్కు అనుకూలంగా లడ్డూలు, మిఠాయిలు కూడా పంపిణీ చేశారు. కుల్విందర్ కౌర్ను సన్మానించనున్నట్లు రైతు సంఘాలు కూడా ప్రకటించాయి. వాస్తవానికి జూన్ 7న కంగనా రనౌత్ ఢిల్లీ వెళ్లేందుకు చండీగఢ్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఆ తర్వాత భద్రతా తనిఖీల కోసం మోహరించిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఉన్నట్లుండి చెంపదెబ్బ కొట్టింది.
తాజావార్తలు
-
Jowar Dosa : షుగర్కు చెక్.. వెయిట్ లాస్ పక్కా.. జొన్న దోశ మ్యాజిక్..!
-
Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే…
-
Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!