Team India: ఫైనల్లో టీమిండియా ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. దీంతో మూడోసారి ప్రపంచ ఛాంపియన్గా నిలవాలన్న భారత జట్టు కల చెదిరిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఆస్ట్రేలియా ముందు 241 పరుగుల లక్ష్యం పెట్టింది. దీన్ని ఆసీస్.. 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా విజయంలో వీరుడిగా నిలిచాడు. ఒకానొక సమయంలో ముగ్గురు ఆస్ట్రేలియా బ్యాటర్లు 48 పరుగులకే పెవిలియన్కు చేరుకున్నారు. అయితే ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుస్చాగ్నే టీమిండియాపై ఎదురుదాడికి దిగి విశ్వవిజేతగా నిలిచారు. అయితే, టీమిండియా ఓటమికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం.
World Cup Final 2023: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ను తిలకించిన ప్రధాని నరేంద్ర మోదీ
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
పేలవమైన ఫీల్డింగ్
టీమిండియా 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. అలాంటి పరిస్థితిల్లో.. భారత ఫీల్డర్ల నుండి మంచి ఫీల్డింగ్ ఆశిస్తారు. కానీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఫీల్డర్లు నిరాశపరిచారు. భారత ఫీల్డర్లు రనౌట్ అయ్యే అనేక అవకాశాలను కోల్పోయారు.
షమీ, బుమ్రా, జడేజా బౌలింగ్
ఈ ప్రపంచకప్ టోర్నీలో భారత బౌలర్లు మంచి ప్రదర్శన చూపించారు. కానీ టైటిల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ల ముందు బొక్కాబోర్లా పడ్డారు. జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ రాణించలేకపోయారు. టైటిల్ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు పేలవంగా కనిపించారు.
చెత్త షాట్లు ఆడి నిరాశపరిచారు
టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా బ్యాట్స్ మెన్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు. ఆస్ట్రేలియన్ బౌలర్లు విజృంభణతో టీమిండియా బ్యాట్స్మెన్లు చెత్త షాట్లు ఆడి వికెట్లను పోగొట్టుకున్నారు. టీమిండియా తరుపున విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మాత్రమే యాభై పరుగుల మార్కును టచ్ చేయగలిగారు. మిగతా బ్యాట్స్మెన్ ఫ్లాప్ షో చూపించారు.
భారత బౌలర్లు ఎక్స్ ట్రా పరుగులు ఇచ్చారు
భారత బౌలర్లు చాలా అదనపు పరుగులు ఇచ్చారు. ముఖ్యంగా ప్రారంభంలో.. మహ్మద్ షమీ తన లైన్ అండ్ లెంగ్త్ నుండి తప్పుకున్నట్లు కనిపించాడు. ఇతర బౌలర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. టీమిండియా బౌలర్లు పేలవమైన లెంగ్త్లలో బౌలింగ్ చేశారు. దీంతో ఆసీస్ బ్యాట్స్మెన్లు సులభంగా పరుగులు చేశారు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కూడా చాలా మిస్ ఫీల్డ్లు చేశాడు. భారత బౌలర్లు 18 ఎక్స్ ట్రాలు ఇచ్చారు. ఇందులో 7 బైలు, 11 వైడ్లు ఉన్నాయి.
ట్రావిస్ హెడ్ తారుమారు చేశాడు
240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 7 ఓవర్లలోపే ముగ్గురు బ్యాట్స్మెన్లు 48 పరుగులకే ఔటయ్యారు. దీంతో భారత అభిమానుల ఆశలు చిగురించాయి.. కానీ ట్రావిస్ హెడ్ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆచితూచి నిలకడగా ఆడి ట్రావిస్ హెడ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో 120 బంతుల్లో 137 పరుగులు చేసిన తర్వాత ట్రావిస్ హెడ్ పెవిలియన్కు వెళ్లాడు. అయితే అప్పటికి ఆస్ట్రేలియా విజయం ఖాయమైంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!