NTV Telugu Site icon

Gopal Rai: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదు.. ఆప్ మంత్రి స్పష్టం

New Project (59)

New Project (59)

ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తుందని ఆప్‌ గురువారం ధృవీకరించింది. లోక్‌సభ ఎన్నికల కోసమే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అది కుదరదని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించిన తర్వాత.. ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసినా 2025 అసెంబ్లీ ఎన్నికల్లో 55 సీట్లు గెలుస్తామని దక్షిణ ఢిల్లీ నుంచి కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎంపీ రాంబీర్ సింగ్ బిధురి ప్రకటించారు. ఎందుకంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను 52 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం సాధించిందన్నారు.

READ MORE: UP: ఉత్తర్ ప్రదేశ్ బీజేపీలో కలకలం.. రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ రాజీనామా!

2025లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో గురువారం పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను కోరారు. లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా ఢిల్లీలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఢిల్లీ ప్రభుత్వ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. ఆప్ శనివారం (జూన్ 8) ఢిల్లీ కౌన్సిలర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయగా, పార్టీ కార్యకర్తల సమావేశం జూన్ 13న జరగనుంది.

కాగా.. ఐదు రాష్ట్రాలైన ఢిల్లీ, హర్యానా, పంజాబ్, గుజరాత్, అస్సాంలోని 22 స్థానాల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో మూడు లోక్‌సభ స్థానాలను గెలుచుకోగలిగింది. ఎన్నికల సంఘం డేటా ప్రకారం.. పంజాబ్‌లో ఇటీవల ప్రకటించిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ రాష్ట్రంలోని 13 లోక్‌సభ నియోజకవర్గాల్లో 33 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.