Waqf Bill: వక్ఫ్ బిల్లు జేపీసీ సమావేశంలో తీవ్ర గందరగోళం.. 10 మంది ప్రతిపక్ష ఎంపీలపై వేటు!
- వక్ఫ్ సవరణ బిల్లుపై జేఏసీ సమావేశం
- సమావేశంలో తీవ్ర దుమారం
- 10 మంది ఎంపీలను జేఏసీ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వక్ఫ్ సవరణ బిల్లుపై శుక్రవారం జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో దుమారం రేగింది. ముసాయిదా బిల్లులో ప్రతిపాదించిన మార్పులను అధ్యయనం చేసేందుకు తగిన సమయం ఇవ్వడం లేదని విపక్ష సభ్యులు ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లుపై… జాయింట్ కమిటీ కాశ్మీర్ మత గురువు మిర్వాయిజ్ ఒమర్ ఫరూక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం అభిప్రాయాలను వినేందుకు సిద్ధమైంది. మిర్వాయిజ్ను పిలవడానికి ముందు.. కమిటీ సభ్యులు తమలో తాము చర్చించుకున్నారు. అనంతరం ప్రతిపక్ష నాయకులు సమావేశంలో గందరగోళం సృష్టించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించిన నివేదికను త్వరగా ఆమోదించాలని బీజేపీ పట్టుబడుతోందని ప్రతిపక్ష సభ్యులు పేర్కొన్నారు.
READ MORE: Puducherry : సోషల్ మీడియాలో అవమానానికి ప్రతీకారం… బాంబుతో స్కూల్ కి వెళ్లిన విద్యార్థి
Also Read
- Nellore Politics: గ్రౌండ్ వర్క్ స్టార్ట్.. రాజకీయాల్లోకి ప్రముఖ నాయకుల కూతుళ్లు, కోడళ్లు!
- IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!
- Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
సమావేశంలో వాడీవేడీ చర్చ జరగడంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. మిర్వాయిజ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం తన సమావేశాన్ని తిరిగి ప్రారంభించింది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ, కాంగ్రెస్కు చెందిన సయ్యద్ నాసిర్ హుస్సేన్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. కమిటీ వ్యవహారాలు ప్రహసనంగా మారాయని వారు అన్నారు. సెక్షన్ల వారీగా ప్రతిపాదించిన సవరణలను పరిశీలించేందుకు జనవరి 27న నిర్వహించనున్న సమావేశాన్ని జనవరి 30 లేదా జనవరి 31వ తేదీకి వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈ సమావేశంలో ఇప్పటి వరకు పది మంది ప్రతిపక్ష ఎంపీలను జేఏసీ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం.
READ MORE: Gottipati Ravi Kumar: చంద్రబాబు కారణంగానే అనేక దేశాల్లో ఉన్నత స్థానాల్లో తెలుగు వారు!
కమిటీ ముందు హాజరు కావడానికి ముందు కశ్మీర్కి చెందిన వేర్పాటువాది మిర్వాయిజ్ మాట్లాడుతూ.. “వక్ఫ్ సవరణ బిల్లును నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. మతపరమైన విషయాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని సమర్థిస్తున్నా. మా సూచనలను విని అమలు చేస్తారని మేము ఆశిస్తున్నాం. ముస్లింలకు ద్రోహం చేసేలా చర్యలు తీసుకోవద్దు.” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Suriya : టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఐదు రూపాయల డాక్టర్ బయోపిక్లో సూర్య..
-
Nellore Politics: గ్రౌండ్ వర్క్ స్టార్ట్.. రాజకీయాల్లోకి ప్రముఖ నాయకుల కూతుళ్లు, కోడళ్లు!
-
IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!
-
SIGMA : జాసన్ సంజయ్ అచ్చు విజయ్ లాగే ఉంటాడు : సందీప్ కిషన్
-
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!