Waqf Bill: వక్ఫ్ బిల్లు జేపీసీ సమావేశంలో తీవ్ర గందరగోళం.. 10 మంది ప్రతిపక్ష ఎంపీలపై వేటు!
- వక్ఫ్ సవరణ బిల్లుపై జేఏసీ సమావేశం
- సమావేశంలో తీవ్ర దుమారం
- 10 మంది ఎంపీలను జేఏసీ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వక్ఫ్ సవరణ బిల్లుపై శుక్రవారం జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో దుమారం రేగింది. ముసాయిదా బిల్లులో ప్రతిపాదించిన మార్పులను అధ్యయనం చేసేందుకు తగిన సమయం ఇవ్వడం లేదని విపక్ష సభ్యులు ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లుపై… జాయింట్ కమిటీ కాశ్మీర్ మత గురువు మిర్వాయిజ్ ఒమర్ ఫరూక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం అభిప్రాయాలను వినేందుకు సిద్ధమైంది. మిర్వాయిజ్ను పిలవడానికి ముందు.. కమిటీ సభ్యులు తమలో తాము చర్చించుకున్నారు. అనంతరం ప్రతిపక్ష నాయకులు సమావేశంలో గందరగోళం సృష్టించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించిన నివేదికను త్వరగా ఆమోదించాలని బీజేపీ పట్టుబడుతోందని ప్రతిపక్ష సభ్యులు పేర్కొన్నారు.
READ MORE: Puducherry : సోషల్ మీడియాలో అవమానానికి ప్రతీకారం… బాంబుతో స్కూల్ కి వెళ్లిన విద్యార్థి
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
సమావేశంలో వాడీవేడీ చర్చ జరగడంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. మిర్వాయిజ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం తన సమావేశాన్ని తిరిగి ప్రారంభించింది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ, కాంగ్రెస్కు చెందిన సయ్యద్ నాసిర్ హుస్సేన్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. కమిటీ వ్యవహారాలు ప్రహసనంగా మారాయని వారు అన్నారు. సెక్షన్ల వారీగా ప్రతిపాదించిన సవరణలను పరిశీలించేందుకు జనవరి 27న నిర్వహించనున్న సమావేశాన్ని జనవరి 30 లేదా జనవరి 31వ తేదీకి వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈ సమావేశంలో ఇప్పటి వరకు పది మంది ప్రతిపక్ష ఎంపీలను జేఏసీ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం.
READ MORE: Gottipati Ravi Kumar: చంద్రబాబు కారణంగానే అనేక దేశాల్లో ఉన్నత స్థానాల్లో తెలుగు వారు!
కమిటీ ముందు హాజరు కావడానికి ముందు కశ్మీర్కి చెందిన వేర్పాటువాది మిర్వాయిజ్ మాట్లాడుతూ.. “వక్ఫ్ సవరణ బిల్లును నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. మతపరమైన విషయాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని సమర్థిస్తున్నా. మా సూచనలను విని అమలు చేస్తారని మేము ఆశిస్తున్నాం. ముస్లింలకు ద్రోహం చేసేలా చర్యలు తీసుకోవద్దు.” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!