కేంద్రం కొత్త ఐటీరూల్స్తో ప్రయోజనాలు ఇవే..
రాజ్యాంగం ద్వారా కల్పించిన వాక్, స్వేచ్ఛ స్వాతంత్రత్యాలు భావ ప్రకటన స్వేచ్చకు అనుగుణంగా కొత్త ఐటీ రూల్స్ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వ్యక్తుల ఆన్లైనన్ ప్రైవసీకి సంబంధించి కాపాడేందుకు అనుసరించాల్సిన నియమాలు, మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని ఐటీ మంత్రి త్వ శాఖ తెలిపింది. మొత్తం మీద faqలు ఇంటర్నెట్, సోషల్ మీడియా వినయోగదారులకు కొత్త నిబంధనలు ఉన్నాయని మహి ళలు, చిన్నారుల భద్రతను పెంచేందుకు రూల్స్ ఉన్నాయని ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త ఐటీ నియమాలు 2021 యూజర్ల హక్కులకు అనుగుణంగా రూపొందించారు.
వినియోగదారులపై ఎలాంటి జరిమానాలు విధించవద్దని ఆ శాఖ స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య దేశంలో వినియోగ దారులందరికీ సమాచారం అందుబాటులో ఉండాలని, వినియోగదారులకు ఎలాంటి హాని కలగకూడదని భావించినట్టు ఎలక్ర్టానిక్స్,ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. దీనికి సంబంధించిన ఎఫ్ఏ క్యూలను ఆయన విడుదల చేశారు. ఎక్కువ మంది ఆన్లైన్ చాటింగ్ ఇతర కార్యక్రమాలకు మధ్యవర్తిగా ఆయన ప్రస్తావించారు. . వాణిజ్య, ఇతర లావాదేవీలు ప్రారంభించడం ఇంటర్నెట్ లేదా సెర్చింజన్ సేవలు, ఈ మెయిల్ సర్వీసులు, ఆన్లైన్ స్టోరేజ్సేవ మొదలైన వాటికి ప్రాథమిక విషయాలలో యాక్సస్ ఉంటుందన్నారు.
Also Read
- Mumbai Indians: ఐపీఎల్లో వరుస ఓటములు.. అయినా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్...
- Kavitha: పాత రాజకీయాలకు విసిగిపోయారు.. తెలంగాణలో కూడా మార్పు తథ్యం: కవిత
- Exit Polls Failed: సర్వేలకు అందని ఓటర్ నాడి.. తలకిందులైన ఎగ్జిట్ పోల్స్..
- Labour Cards: శుభవార్త.. అర్హులైన ప్రతి ఒక్కరికీ లేబర్ కార్డులు..
ఇలాంటి వాటిలో సోషల్ మీడియాను మద్యవర్తిగా భావించలేమని మంత్రిత్వ శాఖ 20పేజీల పత్రాలలో తెలిపింది. సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్లకు ఉపసంహారణ నోటీసులు జారీ చేసే అధికారం ఉన్న తగిన ఏజెన్సీల వివరాలను కలిగి ఉండే ఐటీ నియమాలు, మధ్య వర్తిత్వ నిబంధనల చుట్టూ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్( ఎస్ఓపీ)తో వస్తుందని మత్రతిత్వ శాఖ తెలిపింది.
కొత్త ఐటీ రూల్స్ ప్రకారం చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్, నోడల్ కాంటాక్ట్ పర్సన్ ఒకే వ్యక్తి ఉండొద్దని పేర్కొంది. అయితే నోడల్ కాంటాక్ట్ పర్సన్, రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ సేవలను ఒకే వ్యక్తి అందించ వచ్చని తెలిపింది. ముఖ్యమైన సోషల్ మీడియా మధ్యవర్తి( ఎస్ ఎస్ఎంఐ) రెండు పోస్టులకు వేర్వేరు వ్యక్తులను నియమించాలని పేర్కొంది. నగ్నత్వం లేదా మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియా కంపెనీలు ఫిర్యాదు స్వీకరించిన 24 గంటల్లో తొలగించాలి. ఈ నిబంధన50 లక్షలు అంతకన్నా ఎక్కు వ ఉన్న వినియోగ దారులున్న సోషల్ మీడియా సైట్లకు వర్తిస్తుంది.
సైబర్ ప్రపంచం అభివృద్ధితోపాటు నేరాలు ఘణనీయంగా పెరిగా యని, జవాబుదారీ తనం పెంచితే వినియోగదారుల సమాచా రానికి భద్రత ఉంటుదన్నారు. వినియోగదారుల ప్రయోజ నాలు రక్షిం చడమే ప్రభుత్వ విధానామని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. భారత్లో 80 కోట్ల మంది ఆన్లైన్ వినియోగదారులు ఉన్నారని ఆయన అన్నారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ రూల్స్ను మెటా కంపెనీ ప్రతినిధి స్వాగతించారని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Election Results 2026: తమిళనాడులో హంగ్కే అవకాశం..! 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా బీజేపీ..! టీఎంసీకి మరో షాక్..! అప్డేట్స్ మీకోసం..
-
Mumbai Indians: ఐపీఎల్లో వరుస ఓటములు.. అయినా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్…
-
Vijay Dhamu: ఆటో స్టాండ్ నుంచి అసెంబ్లీకి.. రాయపురంలో మాజీ మంత్రి కోటను కూల్చిన సామాన్యుడు!
-
CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష
-
YS Jagan : విజయ్కు జగన్ అభినందనలు.. ‘తొలి అడుగులోనే అద్భుతం’ అంటూ ట్వీట్.!
-
Kavitha: పాత రాజకీయాలకు విసిగిపోయారు.. తెలంగాణలో కూడా మార్పు తథ్యం: కవిత
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!